Ganta Srinivas rao: గంటాలో సడెన్ మార్పుకు కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా.. గెలుపుపై గ్యారంటీ ఉన్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే అది గంటా శ్రీనివాసరావు మాత్రమే. ఎన్నికల్లో ఆయన ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా.. ఏ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినా గెలుపు సొంతం చేసుకుంటారు. వైసీపీ ప్రభంజనం సృష్టించిన 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత గంటా సైలెంట్ అయ్యారు. పార్టీ మారాలని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా స్పీకర్ ఆమోదించలేదు.
అప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీలో కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తనపై, తన భార్య పైనా వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నీరు పెట్టిన సందర్భంలో పార్టీకి సంబంధం లేని వారు సైతం స్పందించారు. కానీ గంటా మాత్రం ఎక్కడా తన వాయిస్ వినిపించలేదు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ మారతారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఉన్నట్టుండి టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీ మళ్లీ బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలని గంటా ఆకాంక్షించారు.
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
Ganta Srinivasa Rao: ఏపీ బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి
అయితే గంటాలో సడెన్ మార్పుకు కారణం ఇటీవల చంద్రబాబు చేసిన ప్రకటనే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని.. పార్టీకి కష్టకాలంలో అండదండలు అందించిన వారికే ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో గంటా శ్రీనివాసరావు మేల్కొన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ గేట్లు మూసుకుపోవడంతో బీజేపీ, జనసేన లాంటి పార్టీల్లో చేరటం కంటే.. టీడీపీలోనే కొనసాగి తన ప్రాధాన్యం పెంచుకోవడం బెటరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!