కొన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ బిల్లు పెట్టాం: జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో రాజధానుల బిల్లును వెనక్కు తీసుకోవడం పై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లం ఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.రాజధాని ప్రాం తం అంటే నాకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. నా ఇల్లు ఇక్క డే ఉంది.. ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ ఉందిరాజధాని అటు విజయ వాడ కాదు.. ఇటు గుంటూరు కాదు. ఈ ప్రాంతంలో కనీస వస తుల కల్పనకే లక్షల కోట్లు అవుతాయన్నారు. ఈ రోజు లక్ష కోట్లు పదేళ్లకు రూ.6 లక్షల కోట్లు అవుతుందన్నారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే మౌలిక వసతుల కల్పనకు లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అలాంటప్పుడు మన పిల్లకు పెద్ద నగరాన్ని ఎప్పుడు అందిస్తామని, ఉద్యోగాలు ఎలా కల్పిస్తామని జగన్ అన్నారు. రాష్ట్రం లో అతిపెద్ద సిటీ విశాఖపట్నం.. అన్ని వసతులు ఉన్న నగరం విశా ఖ కొద్దిగా మౌలిక వసతులు వెచ్చిస్తే హైదరాబాద్ లాంటి నగరంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల బిల్లును తెరపైకి తీసుకువచ్చాం కానీ, ఈ బిల్లుకు ఆదినుంచి వ్యతిరేకత వ్యక్తం అవు తునే ఉంది. పైగా ప్రతిపక్ష పార్టీలు అన్ని బిల్లును వ్యతిరేకిస్తూ కోర్టు కేసుల చూట్టు ప్రభుత్వం తిరాగాల్సి రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వస్తోందని జగన్ తెలిపారు.
గతంలో ఉన్న మూడు రాజధానులకు సంబంధించిన చరిత్రను బుగ్గన సుదీర్ఘంగా చెప్పారన్నారు. ఆంధ్ర రాష్ర్టానికి రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటురూలో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత రెండు హైదరాబాద్కు తీసుకుని వెళ్లారు. అక్కడి ప్రజలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఇప్పుడున్న మూడు రాజ ధానుల చట్టాన్ని వెనక్కు తీసుకుని మరో కొత్త చట్టంతో ముందుకు వస్తామన్నారు. ఇప్పుడు తీసుకు వచ్చే బిల్లును మరింత మెరుగు పర్చేందుకు కృషి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే బిల్లును తీసుకొచ్చాం.చట్ట పరంగా కొన్ని న్యాయ సంబంధమైన చిక్కులు ఉన్నాయి.
Also Read
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ప్రభుత్వం ప్రవేశపెట్టి మూడు రాజధానుల బిల్లును గతంలో అసెంబ్లీలో ఆమోదం పొందిన శాసన మండలిలో సెలెక్టు కమిటీకి పంపించాలని చెప్పడం. రేపు న్యాయ సమీక్షకు వస్తే బిల్లు ఎంత వరకునిలబడతాయనేది ప్రశ్న వస్తుంది. అందుకోసం రేపు హైకోర్టు ముందుకు వెళ్లితే ఈ బిల్లులు వీగిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ఈ తప్పును ముందే గుర్తించి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ మూడు రాజధానుల బిల్లుకు స్వల్ప విరామం మాత్రమేనని జగన్ తెలిపారు. కొత్త బిల్లులో ఎలాంటి లోపం లేకుండా మూడు రాజధా నుల బిల్లులను అందరి ఆమోదం పొందేలా తీసుకొస్తామని జగన్ తెలిపారు.
తాజావార్తలు
-
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
-
Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
-
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!