కొన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ బిల్లు పెట్టాం: జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో రాజధానుల బిల్లును వెనక్కు తీసుకోవడం పై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లం ఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.రాజధాని ప్రాం తం అంటే నాకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. నా ఇల్లు ఇక్క డే ఉంది.. ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ ఉందిరాజధాని అటు విజయ వాడ కాదు.. ఇటు గుంటూరు కాదు. ఈ ప్రాంతంలో కనీస వస తుల కల్పనకే లక్షల కోట్లు అవుతాయన్నారు. ఈ రోజు లక్ష కోట్లు పదేళ్లకు రూ.6 లక్షల కోట్లు అవుతుందన్నారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే మౌలిక వసతుల కల్పనకు లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అలాంటప్పుడు మన పిల్లకు పెద్ద నగరాన్ని ఎప్పుడు అందిస్తామని, ఉద్యోగాలు ఎలా కల్పిస్తామని జగన్ అన్నారు. రాష్ట్రం లో అతిపెద్ద సిటీ విశాఖపట్నం.. అన్ని వసతులు ఉన్న నగరం విశా ఖ కొద్దిగా మౌలిక వసతులు వెచ్చిస్తే హైదరాబాద్ లాంటి నగరంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల బిల్లును తెరపైకి తీసుకువచ్చాం కానీ, ఈ బిల్లుకు ఆదినుంచి వ్యతిరేకత వ్యక్తం అవు తునే ఉంది. పైగా ప్రతిపక్ష పార్టీలు అన్ని బిల్లును వ్యతిరేకిస్తూ కోర్టు కేసుల చూట్టు ప్రభుత్వం తిరాగాల్సి రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వస్తోందని జగన్ తెలిపారు.
గతంలో ఉన్న మూడు రాజధానులకు సంబంధించిన చరిత్రను బుగ్గన సుదీర్ఘంగా చెప్పారన్నారు. ఆంధ్ర రాష్ర్టానికి రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటురూలో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత రెండు హైదరాబాద్కు తీసుకుని వెళ్లారు. అక్కడి ప్రజలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఇప్పుడున్న మూడు రాజ ధానుల చట్టాన్ని వెనక్కు తీసుకుని మరో కొత్త చట్టంతో ముందుకు వస్తామన్నారు. ఇప్పుడు తీసుకు వచ్చే బిల్లును మరింత మెరుగు పర్చేందుకు కృషి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే బిల్లును తీసుకొచ్చాం.చట్ట పరంగా కొన్ని న్యాయ సంబంధమైన చిక్కులు ఉన్నాయి.
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ప్రభుత్వం ప్రవేశపెట్టి మూడు రాజధానుల బిల్లును గతంలో అసెంబ్లీలో ఆమోదం పొందిన శాసన మండలిలో సెలెక్టు కమిటీకి పంపించాలని చెప్పడం. రేపు న్యాయ సమీక్షకు వస్తే బిల్లు ఎంత వరకునిలబడతాయనేది ప్రశ్న వస్తుంది. అందుకోసం రేపు హైకోర్టు ముందుకు వెళ్లితే ఈ బిల్లులు వీగిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ఈ తప్పును ముందే గుర్తించి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ మూడు రాజధానుల బిల్లుకు స్వల్ప విరామం మాత్రమేనని జగన్ తెలిపారు. కొత్త బిల్లులో ఎలాంటి లోపం లేకుండా మూడు రాజధా నుల బిల్లులను అందరి ఆమోదం పొందేలా తీసుకొస్తామని జగన్ తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!