Andhra Pradesh: దండం పెట్టి, గుంజీలు తీసిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హెచ్ఎం వీడియో..
- మీకు మేం ఏమీ చేయలేకపోతున్నాం.. అందుకే నేనే శిక్షంచుకుంటున్నా..
- విద్యార్థులకు దండం పెట్టి, గుంజీలు తీసిన ఉపాధ్యాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఓ ఉపాధ్యాయుడు గుంజీలు తీయడం, పొర్లు దండాలు పెట్టడం వైరల్గా మారిపోయింది.. అదేంటి..? ఎక్కడైనా విద్యార్థులతో ఉపాధ్యాయుడు గుంజీలు తీయిస్తాడు.. కానీ, ఆయనే గుంజీలు ఎందుకు తీశారు..? పైగా క్షమాపణలు ఎందుకు చెప్పారు.. అనేది చర్చగా మారింది.. అసలు విషయం ఏటంటే.. ఈ రోజుల్లో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా.. స్మార్ట్ఫోన్లతో గడిపేస్తున్నారు.. టీవీలకు ఎగబడుతున్నారు.. అందేకాదు.. ఉపాధ్యాయుడు మంచి మాటలు చెబితే.. పట్టించుకోవడం తర్వాత సంగతి.. ఎదురు తిరగడం.. మరోవైపు.. మా పిల్లలపై మీరు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ.. పిల్లల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులను తప్పుబడుతోన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నాం.. అందుకే నన్ను నేనే శిక్షంచుకుంటున్నాను అంటూ.. ఉపాధ్యాయుడుచేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Read Also: Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్ని క్వశ్చన్ చేసిన నెటిజన్
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి మండలం పెంటగ్రామలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణ ఆవేదన ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. పిల్లలు ఏమీ చదవడం లేదని.. అక్షరం ముక్క కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆ ప్రభుత్వ టీచర్.. మీకు మేము ఏమీ చేయలేకపోతున్నందుకు నాకు నేనుశిక్షించుకుంటున్నానంటూ.. పిల్లలను క్షమాపణ కోరుతూ మేం ఏమి చేయలేం నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుత రోజుల్లో పిల్లలకు చదువు రాకపోతే వాళ్లకి బుద్ధి నేర్పే పద్ధతిలో మేం చెప్తే మా పైన అధికారులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటున్నారు.. మేం ఏమి చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మమ్మల్ని క్షమించండి అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండం పెట్టారు.. స్టేజ్పై గుంజీలు తీశారు.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నందుకే ఈ విధంగా గుంజీలు తీసున్నానని పేర్కొన్నారు.. మేం కొట్టలేం.. తిట్టలేం.. ఏమీ చేయలేం.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. అంటూ ఆ హెచ్ఎం చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి.. దీంతో.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!