Andhra Pradesh: దండం పెట్టి, గుంజీలు తీసిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హెచ్ఎం వీడియో..
- మీకు మేం ఏమీ చేయలేకపోతున్నాం.. అందుకే నేనే శిక్షంచుకుంటున్నా..
- విద్యార్థులకు దండం పెట్టి, గుంజీలు తీసిన ఉపాధ్యాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఓ ఉపాధ్యాయుడు గుంజీలు తీయడం, పొర్లు దండాలు పెట్టడం వైరల్గా మారిపోయింది.. అదేంటి..? ఎక్కడైనా విద్యార్థులతో ఉపాధ్యాయుడు గుంజీలు తీయిస్తాడు.. కానీ, ఆయనే గుంజీలు ఎందుకు తీశారు..? పైగా క్షమాపణలు ఎందుకు చెప్పారు.. అనేది చర్చగా మారింది.. అసలు విషయం ఏటంటే.. ఈ రోజుల్లో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా.. స్మార్ట్ఫోన్లతో గడిపేస్తున్నారు.. టీవీలకు ఎగబడుతున్నారు.. అందేకాదు.. ఉపాధ్యాయుడు మంచి మాటలు చెబితే.. పట్టించుకోవడం తర్వాత సంగతి.. ఎదురు తిరగడం.. మరోవైపు.. మా పిల్లలపై మీరు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ.. పిల్లల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులను తప్పుబడుతోన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నాం.. అందుకే నన్ను నేనే శిక్షంచుకుంటున్నాను అంటూ.. ఉపాధ్యాయుడుచేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Read Also: Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్ని క్వశ్చన్ చేసిన నెటిజన్
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి మండలం పెంటగ్రామలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణ ఆవేదన ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. పిల్లలు ఏమీ చదవడం లేదని.. అక్షరం ముక్క కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆ ప్రభుత్వ టీచర్.. మీకు మేము ఏమీ చేయలేకపోతున్నందుకు నాకు నేనుశిక్షించుకుంటున్నానంటూ.. పిల్లలను క్షమాపణ కోరుతూ మేం ఏమి చేయలేం నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుత రోజుల్లో పిల్లలకు చదువు రాకపోతే వాళ్లకి బుద్ధి నేర్పే పద్ధతిలో మేం చెప్తే మా పైన అధికారులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటున్నారు.. మేం ఏమి చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మమ్మల్ని క్షమించండి అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండం పెట్టారు.. స్టేజ్పై గుంజీలు తీశారు.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నందుకే ఈ విధంగా గుంజీలు తీసున్నానని పేర్కొన్నారు.. మేం కొట్టలేం.. తిట్టలేం.. ఏమీ చేయలేం.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. అంటూ ఆ హెచ్ఎం చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి.. దీంతో.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!