Andhra Pradesh: దండం పెట్టి, గుంజీలు తీసిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హెచ్ఎం వీడియో..
- మీకు మేం ఏమీ చేయలేకపోతున్నాం.. అందుకే నేనే శిక్షంచుకుంటున్నా..
- విద్యార్థులకు దండం పెట్టి, గుంజీలు తీసిన ఉపాధ్యాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఓ ఉపాధ్యాయుడు గుంజీలు తీయడం, పొర్లు దండాలు పెట్టడం వైరల్గా మారిపోయింది.. అదేంటి..? ఎక్కడైనా విద్యార్థులతో ఉపాధ్యాయుడు గుంజీలు తీయిస్తాడు.. కానీ, ఆయనే గుంజీలు ఎందుకు తీశారు..? పైగా క్షమాపణలు ఎందుకు చెప్పారు.. అనేది చర్చగా మారింది.. అసలు విషయం ఏటంటే.. ఈ రోజుల్లో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా.. స్మార్ట్ఫోన్లతో గడిపేస్తున్నారు.. టీవీలకు ఎగబడుతున్నారు.. అందేకాదు.. ఉపాధ్యాయుడు మంచి మాటలు చెబితే.. పట్టించుకోవడం తర్వాత సంగతి.. ఎదురు తిరగడం.. మరోవైపు.. మా పిల్లలపై మీరు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ.. పిల్లల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులను తప్పుబడుతోన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నాం.. అందుకే నన్ను నేనే శిక్షంచుకుంటున్నాను అంటూ.. ఉపాధ్యాయుడుచేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Read Also: Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్ని క్వశ్చన్ చేసిన నెటిజన్
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది'
విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి మండలం పెంటగ్రామలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణ ఆవేదన ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. పిల్లలు ఏమీ చదవడం లేదని.. అక్షరం ముక్క కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆ ప్రభుత్వ టీచర్.. మీకు మేము ఏమీ చేయలేకపోతున్నందుకు నాకు నేనుశిక్షించుకుంటున్నానంటూ.. పిల్లలను క్షమాపణ కోరుతూ మేం ఏమి చేయలేం నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుత రోజుల్లో పిల్లలకు చదువు రాకపోతే వాళ్లకి బుద్ధి నేర్పే పద్ధతిలో మేం చెప్తే మా పైన అధికారులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటున్నారు.. మేం ఏమి చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మమ్మల్ని క్షమించండి అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండం పెట్టారు.. స్టేజ్పై గుంజీలు తీశారు.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నందుకే ఈ విధంగా గుంజీలు తీసున్నానని పేర్కొన్నారు.. మేం కొట్టలేం.. తిట్టలేం.. ఏమీ చేయలేం.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. అంటూ ఆ హెచ్ఎం చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి.. దీంతో.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..