Vizag Cp Srikanth:విశాఖ ఘటనపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 15 వ తేదీన పవన కళ్యాణ్ విశాఖ పర్యటనలో జరిగిన సంఘటనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్. పవన్ కళ్యాణ్ పర్యటన కు సంబంధించి జనసేన పి ఏ సి సభ్యులు సమాచారం ఇచ్చారు..ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పలేదు. కొందరు మంత్రులు 15 వ తేదీ సాయంత్రం విశాఖ లో గర్జన కార్యక్రమం ముగించుకొని ఎయిర్ పోర్టు కు వచ్చిన తరుణం లో వారిపై దాడి చేశారు. ఈ దాడి లో మంత్రి రోజా సహాయకులు దిలీప్ కుమార్ తోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పెందుర్తి సీఐ గాయాలు అయ్యాయన్నారు.
ముందస్తు ప్రణాళికలు ప్రకారమే దాడి చేశారని భావించాలి. ఈ సంఘటనలో జనసేన నాయకులు పై కేసులు నమోదు చేసాం. పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసాం. ర్యాలీ వలన జాతీయ రహదారిపై నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. 30 మంది ప్రయాణికులు విమానాలు అందుకోలేకపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసాం. ర్యాలీ కి అనుమతి లేదు అంటూ నప్పజెప్పి డి సి పి పవన్ కళ్యాణ్ ను హోటల్ కు తీసుకువెళ్లారు. నగర ప్రజలు శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించాలి.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
Read Also: Yanamala Ramakrishnudu: తప్పులు, అప్పులు కప్పిపుచ్చుకునేందుకు జగన్ తంటాలు
ఈ సంఘటనకు సంబంధించి జనసేన నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు సంఘటన, విధులకు ఆటంకం కలిగించిన సంఘటనలో ఇప్పటివరకు 100 మందిని అరెస్టు చేసాము. మరికొంతమంది గుర్తిస్తున్నాం వారిని కూడా అరెస్టు చేస్తాం అని వివరణ ఇచ్చారు విశాఖ సీపీ శ్రీకాంత్. విశాఖ ఎయిర్ పోర్టులో దాడి ఘటనలో మొత్తం 70 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా…వారిలో 61 మందికి బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో మిగిలిన 9 మందికి స్థానిక కోర్టు రిమాండ్ విధించగా… వారంతా విశాఖ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలన్న నిందితుల పిటిషన్లను విశాఖ కోర్టు కొట్టివేసింది. అనంతరం వారంతా హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం వీరి పిటిషన్లపై విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు.. మొత్తం 9 మందికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత శనివారం 9 మంది జనసేన నేతలను విశాఖ జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: India vs Pakistan: దీపావళి ధమాకా.. విరాట్ విశ్వరూపం.. పాక్పై భారత్ విజయం
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!