Vizag Cp Srikanth:విశాఖ ఘటనపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 15 వ తేదీన పవన కళ్యాణ్ విశాఖ పర్యటనలో జరిగిన సంఘటనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్. పవన్ కళ్యాణ్ పర్యటన కు సంబంధించి జనసేన పి ఏ సి సభ్యులు సమాచారం ఇచ్చారు..ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పలేదు. కొందరు మంత్రులు 15 వ తేదీ సాయంత్రం విశాఖ లో గర్జన కార్యక్రమం ముగించుకొని ఎయిర్ పోర్టు కు వచ్చిన తరుణం లో వారిపై దాడి చేశారు. ఈ దాడి లో మంత్రి రోజా సహాయకులు దిలీప్ కుమార్ తోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పెందుర్తి సీఐ గాయాలు అయ్యాయన్నారు.
ముందస్తు ప్రణాళికలు ప్రకారమే దాడి చేశారని భావించాలి. ఈ సంఘటనలో జనసేన నాయకులు పై కేసులు నమోదు చేసాం. పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసాం. ర్యాలీ వలన జాతీయ రహదారిపై నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. 30 మంది ప్రయాణికులు విమానాలు అందుకోలేకపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసాం. ర్యాలీ కి అనుమతి లేదు అంటూ నప్పజెప్పి డి సి పి పవన్ కళ్యాణ్ ను హోటల్ కు తీసుకువెళ్లారు. నగర ప్రజలు శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించాలి.
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Read Also: Yanamala Ramakrishnudu: తప్పులు, అప్పులు కప్పిపుచ్చుకునేందుకు జగన్ తంటాలు
ఈ సంఘటనకు సంబంధించి జనసేన నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు సంఘటన, విధులకు ఆటంకం కలిగించిన సంఘటనలో ఇప్పటివరకు 100 మందిని అరెస్టు చేసాము. మరికొంతమంది గుర్తిస్తున్నాం వారిని కూడా అరెస్టు చేస్తాం అని వివరణ ఇచ్చారు విశాఖ సీపీ శ్రీకాంత్. విశాఖ ఎయిర్ పోర్టులో దాడి ఘటనలో మొత్తం 70 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా…వారిలో 61 మందికి బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో మిగిలిన 9 మందికి స్థానిక కోర్టు రిమాండ్ విధించగా… వారంతా విశాఖ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలన్న నిందితుల పిటిషన్లను విశాఖ కోర్టు కొట్టివేసింది. అనంతరం వారంతా హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం వీరి పిటిషన్లపై విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు.. మొత్తం 9 మందికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత శనివారం 9 మంది జనసేన నేతలను విశాఖ జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: India vs Pakistan: దీపావళి ధమాకా.. విరాట్ విశ్వరూపం.. పాక్పై భారత్ విజయం
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!