Vizag: శెభాష్.. 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన విశాఖ సిటీ పోలీస్
- 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు. తప్పిపోయిన బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన విశాఖ పోలీసులు
- కూతురు మొబైల్ ఎక్కువగా చూస్తుందని మందలించిన తండ్రి
- చెప్పా పెట్టకుండా లాడ్జి నుండి బయటకు వెళ్ళిపోయిన బాలిక
- వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
- గాలింపు చర్యలు చేపట్టి బాలిక ఆచూకీ కనుక్కున్న వన్ టౌన్ పోలీసులు.
తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మహిళలు, బాలికలు, యువతల కేసుల్లో విశాఖ పోలీసులు పట్టుబట్టి కేసును చేధిస్తున్నారు. తాజాగా.. మరో మిస్సింగ్ కేసును విశాఖ పోలీసులు సాల్యూ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన ఓ బాలిక మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించి తల్లిదండ్రులకు అప్పగించారు. విశాఖ సీపీ శంకభ్రత బగ్చీ పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీసులు క్షణాల్లో స్పందించిన తీరును బాలిక తల్లిదండ్రులు కొనియాడారు.
Read Also: Swati Maliwal: హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన
Also Read
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
- Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
- Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
కాగా.. కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ కుటుంబం విహారయాత్ర కోసమని విశాఖ వచ్చారు. హార్బర్ వ్యూ ల్యాడ్జీలో బసకు దిగారు. అయితే.. ఆ సమయంలో సదరు బాలిక ఎక్కువగా ఫోన్ చూస్తోందంటూ తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో.. కోపంతో లాడ్జీ నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు సీపీ బగ్చీకి వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. వెంటన అప్రమత్తమైన పోలీసులు.. బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. సొంత కుటుంబ సభ్యుల్లా భావించి బాలిక తల్లిదండ్రులకు పోలీసులు వసతి కల్పించి, ఆహారం పెట్టించారు. అయితే.. 24 గంటల్లోపే బాలిక ఆచూకీ కనిపెట్టి వన్ టౌన్ పోలీసులు క్షేమంగా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాధిత తల్లిదండ్రులు విశాఖ సిటీ పోలీసుల సేవలను అభినందించారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!