Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..
- విశాఖలో బడ్జెట్ పై మేధావుల సమావేశం
- పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
- బడ్జెట్ లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు- భూపతిరాజు
- రైతులకు పెద్ద పీట వేశారు- భూపతిరాజు శ్రీనివాస వర్మ
- ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది- భూపతిరాజు.
విశాఖలో నిర్వహించిన బడ్జెట్ పై మేధావుల సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు.. రైతులకు పెద్ద పీట వేశారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. వ్యవసాయ పెట్టుబడి సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రం ధన్ వ్యయన్ అనే పథకం తీసుకువచ్చింది.. ఫసల్ బీమా యోజన యధావిధిగా కొనసాగుతోంది.. యూరియా, డీఏపీ ధరల విషయంలో రాయతీలు ఇస్తోందని పేర్కొన్నారు. మరోవైపు.. విద్యకు పెద్ద ఎత్తున 2014లోనే ప్రాధాన్యత ఇచ్చారు.. దేశంలో 360 యూనివర్సిటీలు మంజూరు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చే నాటికి 51 వేల మెడికల్ సీట్లు ఉండేవి.. పదేళ్ల కాలంలో లక్షా 10 వేలకు పెంచారని వెల్లడించారు. దేశంలో 18 ఎయిమ్స్, 360 యూనివర్సిటీలు వచ్చాయి.. ఏపీకి 2 ఎయిమ్స్ వచ్చాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అటల్ ల్యాబ్స్ను 50 వేలు ఏర్పాటు చేయనున్నాం.. పాఠశాల స్ధాయిలోనే సృజనాత్మకతను వెలికితీసే ఆలోచనలో ఉన్నామని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
Bangladesh: అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్తో తొలిసారిగా వాణిజ్యం..
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.12 లక్షలు ఆర్జించే వ్యక్తి రూ.2 లక్షలు చెల్లించే పరిస్ధితి ఉండేదని భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. బుల్లెట్ రైళ్ల నిర్మాణం ప్రారంభమైంది.. వందేభారత్ రైళ్లు అధికంగా అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఒక్క ఏపీకే రైల్వేల అభివృద్ధికి 9,400 కోట్లు కేటాయించారని తెలిపారు. అభివృద్ది విశాఖ చుట్టే తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు పనులు మొదలవుతున్నాయన్నారు. మరోవైపు.. ఏఐ పరిశోధనల్లో దేశం ముందుంది.. ఒక ఏఐ సెంటర్ విశాఖలో ఇవ్వాలని కోరితే అశ్వని వైష్టవ్ అంగీకరించారని తెలిపారు. మహిళల కోసం ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ముద్ర యోజన పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాం.. 13 కులాలకు విశ్వకర్మ యోజన ద్వారా చేయోతనిస్తున్నామని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
Tragedy: పోలవరం కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి..
దేశంలో 117 విమానాశ్రయాలు ప్రారంభించాలని నిర్ణయించాం.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోందని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులు సాధ్యమా అని ప్రపంచదేశాలు హేళన చేశాయి.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ తొలి స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. చిరు వ్యాపారస్తులు సైతం డిజిటల్ లావేదేవీలు చేస్తున్నారు.. త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారబోతోందని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. పోలవరం, రైల్వేజోన్ నిర్మాణానికి రామాయపట్నంలో రిఫైనరీ ఏర్పాటు జరుగుతోందని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు వినియోగించుకోలేని దుస్ధితి గత ఐదేళ్లలో చూశాం.. జలజీవన్ మిషన్ నిధులు పూర్తికాలేదు.. వాటికోసం 2025 నుంచి మరో 3 ఏళ్లు అదనపు గడువు ఇచ్చామన్నారు. వ్యాపారంలో 40 లక్షల టర్నోవర్ చేసే సంస్ధలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. 60 లక్షలకు పెంచే ఆలోచనను కేంద్రానికి తెలుపుతామన్నారు. రెరా ఏక్ట్ తీసుకువచ్చినపుడు నిర్మాణ రంగంలో టెక్నాలజీని జోడించారు.. విశాఖ నుంచి దుబాయ్కి విమాన సౌకర్యం అవసరమని చెపుతామని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!