Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..
- విశాఖలో బడ్జెట్ పై మేధావుల సమావేశం
- పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
- బడ్జెట్ లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు- భూపతిరాజు
- రైతులకు పెద్ద పీట వేశారు- భూపతిరాజు శ్రీనివాస వర్మ
- ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది- భూపతిరాజు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో నిర్వహించిన బడ్జెట్ పై మేధావుల సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు.. రైతులకు పెద్ద పీట వేశారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. వ్యవసాయ పెట్టుబడి సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రం ధన్ వ్యయన్ అనే పథకం తీసుకువచ్చింది.. ఫసల్ బీమా యోజన యధావిధిగా కొనసాగుతోంది.. యూరియా, డీఏపీ ధరల విషయంలో రాయతీలు ఇస్తోందని పేర్కొన్నారు. మరోవైపు.. విద్యకు పెద్ద ఎత్తున 2014లోనే ప్రాధాన్యత ఇచ్చారు.. దేశంలో 360 యూనివర్సిటీలు మంజూరు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చే నాటికి 51 వేల మెడికల్ సీట్లు ఉండేవి.. పదేళ్ల కాలంలో లక్షా 10 వేలకు పెంచారని వెల్లడించారు. దేశంలో 18 ఎయిమ్స్, 360 యూనివర్సిటీలు వచ్చాయి.. ఏపీకి 2 ఎయిమ్స్ వచ్చాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అటల్ ల్యాబ్స్ను 50 వేలు ఏర్పాటు చేయనున్నాం.. పాఠశాల స్ధాయిలోనే సృజనాత్మకతను వెలికితీసే ఆలోచనలో ఉన్నామని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
Bangladesh: అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్తో తొలిసారిగా వాణిజ్యం..
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.12 లక్షలు ఆర్జించే వ్యక్తి రూ.2 లక్షలు చెల్లించే పరిస్ధితి ఉండేదని భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. బుల్లెట్ రైళ్ల నిర్మాణం ప్రారంభమైంది.. వందేభారత్ రైళ్లు అధికంగా అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఒక్క ఏపీకే రైల్వేల అభివృద్ధికి 9,400 కోట్లు కేటాయించారని తెలిపారు. అభివృద్ది విశాఖ చుట్టే తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు పనులు మొదలవుతున్నాయన్నారు. మరోవైపు.. ఏఐ పరిశోధనల్లో దేశం ముందుంది.. ఒక ఏఐ సెంటర్ విశాఖలో ఇవ్వాలని కోరితే అశ్వని వైష్టవ్ అంగీకరించారని తెలిపారు. మహిళల కోసం ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ముద్ర యోజన పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాం.. 13 కులాలకు విశ్వకర్మ యోజన ద్వారా చేయోతనిస్తున్నామని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
Tragedy: పోలవరం కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి..
దేశంలో 117 విమానాశ్రయాలు ప్రారంభించాలని నిర్ణయించాం.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోందని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులు సాధ్యమా అని ప్రపంచదేశాలు హేళన చేశాయి.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ తొలి స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. చిరు వ్యాపారస్తులు సైతం డిజిటల్ లావేదేవీలు చేస్తున్నారు.. త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారబోతోందని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. పోలవరం, రైల్వేజోన్ నిర్మాణానికి రామాయపట్నంలో రిఫైనరీ ఏర్పాటు జరుగుతోందని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు వినియోగించుకోలేని దుస్ధితి గత ఐదేళ్లలో చూశాం.. జలజీవన్ మిషన్ నిధులు పూర్తికాలేదు.. వాటికోసం 2025 నుంచి మరో 3 ఏళ్లు అదనపు గడువు ఇచ్చామన్నారు. వ్యాపారంలో 40 లక్షల టర్నోవర్ చేసే సంస్ధలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. 60 లక్షలకు పెంచే ఆలోచనను కేంద్రానికి తెలుపుతామన్నారు. రెరా ఏక్ట్ తీసుకువచ్చినపుడు నిర్మాణ రంగంలో టెక్నాలజీని జోడించారు.. విశాఖ నుంచి దుబాయ్కి విమాన సౌకర్యం అవసరమని చెపుతామని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
-
DC Release Date: గ్యాంగ్స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
-
Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
-
Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!