Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Bhupathiraju Srinivasa Varma Highlights Fast Paced Development Under Nda Government

Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..

Published Date :February 23, 2025 , 4:06 pm
By Rajesh Veeramalla
  • విశాఖలో బడ్జెట్ పై మేధావుల సమావేశం
  • పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
  • బడ్జెట్ లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు- భూపతిరాజు
  • రైతులకు పెద్ద పీట వేశారు- భూపతిరాజు శ్రీనివాస వర్మ
  • ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది- భూపతిరాజు.
Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

విశాఖలో నిర్వహించిన బడ్జెట్ పై మేధావుల సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు.. రైతులకు పెద్ద పీట వేశారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. వ్యవసాయ పెట్టుబడి సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రం ధన్ వ్యయన్ అనే పథకం తీసుకువచ్చింది.. ఫసల్ బీమా యోజన యధావిధిగా కొనసాగుతోంది.. యూరియా, డీఏపీ ధరల విషయంలో రాయతీలు ఇస్తోందని పేర్కొన్నారు. మరోవైపు.. విద్యకు పెద్ద ఎత్తున 2014లోనే ప్రాధాన్యత ఇచ్చారు.. దేశంలో 360 యూనివర్సిటీలు మంజూరు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చే నాటికి 51 వేల మెడికల్ సీట్లు ఉండేవి.‌. పదేళ్ల కాలంలో లక్షా 10 వేలకు పెంచారని వెల్లడించారు. దేశంలో 18 ఎయిమ్స్, 360 యూనివర్సిటీలు వచ్చాయి.. ఏపీకి 2 ఎయిమ్స్ వచ్చాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అటల్ ల్యాబ్స్‌ను 50 వేలు ఏర్పాటు చేయనున్నాం.. పాఠశాల స్ధాయిలోనే సృజనాత్మకతను వెలికితీసే ఆలోచనలో ఉన్నామని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

Bangladesh: అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌తో తొలిసారిగా వాణిజ్యం..

కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.12 లక్షలు ఆర్జించే వ్యక్తి రూ.2 లక్షలు చెల్లించే పరిస్ధితి ఉండేదని భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. బుల్లెట్ రైళ్ల నిర్మాణం ప్రారంభమైంది.. వందేభారత్ రైళ్లు అధికంగా అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఒక్క ఏపీకే రైల్వేల అభివృద్ధికి 9,400 కోట్లు కేటాయించారని తెలిపారు. అభివృద్ది విశాఖ చుట్టే తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు పనులు మొదలవుతున్నాయన్నారు. మరోవైపు.. ఏఐ పరిశోధనల్లో దేశం ముందుంది.. ఒక ఏఐ సెంటర్ విశాఖలో ఇవ్వాలని కోరితే అశ్వని వైష్టవ్ అంగీకరించారని తెలిపారు. మహిళల కోసం ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ముద్ర యోజన పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాం.. 13 కులాలకు విశ్వకర్మ యోజన ద్వారా చేయోతనిస్తున్నామని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

Tragedy: పోలవరం కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి..

దేశంలో 117 విమానాశ్రయాలు ప్రారంభించాలని నిర్ణయించాం.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోందని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులు సాధ్యమా అని ప్రపంచదేశాలు హేళన చేశాయి.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ తొలి స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. చిరు వ్యాపారస్తులు సైతం డిజిటల్ లావేదేవీలు చేస్తున్నారు.. త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారబోతోందని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. పోలవరం, రైల్వేజోన్ నిర్మాణానికి రామాయపట్నంలో రిఫైనరీ ఏర్పాటు జరుగుతోందని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు వినియోగించుకోలేని దుస్ధితి గత ఐదేళ్లలో చూశాం.. జలజీవన్ మిషన్ నిధులు పూర్తికాలేదు.. వాటికోసం 2025 నుంచి మరో 3 ఏళ్లు అదనపు గడువు ఇచ్చామన్నారు. వ్యాపారంలో 40 లక్షల టర్నోవర్ చేసే సంస్ధలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. 60 లక్షలకు పెంచే ఆలోచనను కేంద్రానికి తెలుపుతామన్నారు. రెరా ఏక్ట్ తీసుకువచ్చినపుడు నిర్మాణ రంగంలో టెక్నాలజీని జోడించారు.. విశాఖ నుంచి దుబాయ్‌కి విమాన సౌకర్యం అవసరమని చెపుతామని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhupathiraju Srinivasa Varma
  • economic development
  • Indian Steel Industry
  • National Development Agenda
  • NDA Government

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: ‘నేను బంతిని చూస్తాను.. బౌలర్‌ను కాదు’.. గెలుపు సీక్రెట్ బయటపెట్టిన వైభవ్

  • Mumbai: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

  • Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసు..15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ! ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కుర్రాడు..

  • Sam Altman Controversy: ChatGPT సీఈవోపై ఉద్యోగుల సంచలన ఆరోపణలు..

  • Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions