Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: విశాఖపట్నం నగరం ఇకపై కొత్త దిశగా అడుగులు వేయబోతోందని, ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ ఇకపై డేటా సిటీగా, ఏఐ హబ్గా మారబోతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ ముఖచిత్రం ఈరోజుతో మారిపోతోందని పేర్కొన్నారు. భారత్లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని గూగుల్ విశాఖకు తీసుకువచ్చిందని లోకేష్ తెలిపారు. 2026 ఏప్రిల్ 28 నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ చరిత్ర సృష్టించబోతోందన్నారు. గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖ స్థానం సంపాదించుకుందని చెప్పారు.
Read Also: Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, దానిని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని లోకేష్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడికి హైటెక్ సిటీ నిర్మించిన అనుభవం ఉందని, ఇప్పుడు విశాఖలో కూడా అదే తరహా అభివృద్ధి తీసుకొస్తున్నారని చెప్పారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం వరకు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని వెల్లడించారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు లోకేష్. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, మెకానికల్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని
“ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని” అనేది ప్రజా ప్రభుత్వ విధానమని, “అభివృద్ధి వికేంద్రీకరణ” తమ నినాదమని లోకేష్ స్పష్టం చేశారు. క్లస్టర్ ఆధారిత అభివృద్ధితో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. విశాఖలో ప్రారంభమైన గూగుల్ ఏఐ డేటా సెంటర్తో కొత్త అభివృద్ధి దశకు శ్రీకారం చుట్టినట్టేనని అన్నారు మంత్రి నారా లోకేష్…
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
-
Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
-
Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?