Gudivada Amarnath: దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. తీవ్ర వ్యాఖ్యలు
- సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు
- గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురాలేదని..,
- కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుంది- గుడివాడ అమర్నాథ్
- దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారు
- పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు
- రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదు- గుడివాడ అమర్నాథ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురాలేదని కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే సరికి దేశ వ్యాప్తంగా ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ 11వ స్థానంలో ఉందని తెలిపారు. అయితే వైసీపీ వచ్చాక 9వ స్థానానికి వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ పరిశ్రమలను తీసుకురాకుండా ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా పెరిగిందని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
Read Also: Maha Kumbh Mela 2025: రికార్డ్ స్థాయిలో భక్తులు.. 10 కోట్ల మంది స్నానాలు
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని అన్నారు. లోకేష్ భజనతో దావోస్ ముగిసింది.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్ను దెబ్బ తీశారు.. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్ అని దుయ్యబట్టారు. దావోస్లో కూడా లోకేష్ భజన చేశారని విమర్శించారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలించారని తెలిపారు.
Read Also: Wife For Rent: అద్దెకు భార్యలు? ఎక్కడో కాదు మన దేశంలోనే.. ధర ఎంతంటే?
పెట్టుబడిదారులను వేధింపులకు గురిచేశారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు.. బల్క్ డ్రగ్ పార్క్ వైసీపీ హయాంలో వచ్చిందని తెలిపారు. ప్రధాని శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ గ్రీన్ హబ్ వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చింది.. ఒక హామీ ఒక స్కీం కూడా అమలు చేయలేదు.. నమ్మే వాళ్ళు ఉంటే బిల్ గేట్స్ చంద్రబాబు కలిసి చదువుకున్నాము అంటాడని విమర్శించారు. చంద్రబాబు బ్రాండ్ ఇమెజ్ పెంచుకోవడానికి దావోస్ వెళ్లారు.. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కాదని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!