BV Raghavulu: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం అదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. రాష్ట్రం పరిశ్రమల రంగంలో వేగంగా ముందుకు వెళ్తోందన్న కూటమి నాయకుల వ్యాఖ్యలు మాటలకే పరిమితమైపోయాయని ఆయన అన్నారు. విశాఖలో రాఘవులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల కాలంలో కూడా ఎన్నో పెట్టుబడుల సదస్సులు జరిగినప్పటికీ, వాటిలో కుదిరిన ఒప్పందాల్లో 10 శాతం కూడా అమలుకాలేదని గుర్తుచేశారు. భూములు పొందడానికే కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని, కానీ, పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. గతంలో కేటాయించిన తరహా భూముల్లో ఇప్పటికీ పెద్ద భాగం ఖాళీగానే ఉందని అన్నారు.
Read Also: Varanasi: ‘వారణాసి’ గ్లింప్స్పై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..!
Also Read
గత రెండేళ్లలో రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయని రాఘవులు పేర్కొన్నారు. పర్యటనలు, భారీ సదస్సులు నిర్వహించడం కంటే, నిజంగా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం ముఖ్యం అని సూచించారు. డేటా సెంటర్లు పెద్దగా ఉపాధి అవకాశాలను సృష్టించలేవని, కూలీలు–యువతకు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్కు నాసిరకం ముడిసరుకు సరఫరా అవుతోందని, ఉద్యోగులకు జీతాలు సమయానికి అందడం లేదని ఆరోపించారు. ప్లాంట్లో కీలక పదవులు ఖాళీగా ఉండటాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. మరోవైపు, దేశంలో విమానాయాన రంగం సంక్షోభానికి గురవడం కూడా ప్రైవేటీకరణ విధానాల ఫలితమని రాఘవులు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..