Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- తుంగలం వద్ద కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్
- ఏడుగురు కార్మికులకు గాయాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
- శిథిలాల కింద గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు
- నిర్మాణ లోపాలపై దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag ROB Collapse: విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని తుంగలం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడగా, తృటిలో ఒక భారీ ప్రాణనష్టం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
తుంగలం దగ్గర గత కొంతకాలంగా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఆదివారం మధ్యాహ్నం మూడు , నాలుగో పిల్లర్ల మధ్య డక్టింగ్ పనులు జరుగుతుండగా, ఆ భారీ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం తప్పడానికి ప్రధాన కారణం సమయమేనని చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు భోజన విరామానికి వెళ్లడంతో అక్కడ తక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా, ఆదివారం కావడంతో చాలా మంది పనిలోకి రాలేదని, లేదంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
బ్రిడ్జ్ కుప్పకూలిన వెంటనే పోలీసులు , సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ సమయంలో బ్రిడ్జ్ కింద నుండి వాహనదారులు ఎవరైనా వెళ్తూ శిథిలాల కింద చిక్కుకున్నారా అనే అనుమానంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వాహనాలు లేదా బైక్లు ఏవైనా కింద ఉండిపోయాయా అన్న కోణంలో శిథిలాలను తొలగిస్తున్నారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు, అయితే పూర్తి స్థాయిలో శిథిలాలను తొలగిస్తేనే స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి గాయపడిన కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్మాణంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!