Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- తుంగలం వద్ద కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్
- ఏడుగురు కార్మికులకు గాయాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
- శిథిలాల కింద గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు
- నిర్మాణ లోపాలపై దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag ROB Collapse: విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని తుంగలం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడగా, తృటిలో ఒక భారీ ప్రాణనష్టం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
తుంగలం దగ్గర గత కొంతకాలంగా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఆదివారం మధ్యాహ్నం మూడు , నాలుగో పిల్లర్ల మధ్య డక్టింగ్ పనులు జరుగుతుండగా, ఆ భారీ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం తప్పడానికి ప్రధాన కారణం సమయమేనని చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు భోజన విరామానికి వెళ్లడంతో అక్కడ తక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా, ఆదివారం కావడంతో చాలా మంది పనిలోకి రాలేదని, లేదంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
బ్రిడ్జ్ కుప్పకూలిన వెంటనే పోలీసులు , సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ సమయంలో బ్రిడ్జ్ కింద నుండి వాహనదారులు ఎవరైనా వెళ్తూ శిథిలాల కింద చిక్కుకున్నారా అనే అనుమానంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వాహనాలు లేదా బైక్లు ఏవైనా కింద ఉండిపోయాయా అన్న కోణంలో శిథిలాలను తొలగిస్తున్నారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు, అయితే పూర్తి స్థాయిలో శిథిలాలను తొలగిస్తేనే స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి గాయపడిన కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్మాణంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..