ఉద్యోగాల పేరుతో.. యువతులను గలీజ్ దందాలోకి దింపుతున్న ముఠా అరెస్ట్
- అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్ సీజ్
- బలవంతంగా వ్యభిచారంలో దింపుతున్న స్పా సెంటర్ల యజమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో స్పా పేరుతో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్ను సీజ్ చేశారు పోలీసులు. నిర్వాహకులతో పాటు అరెస్ట్ చేశారు. అయితే.. ఉద్యోగాల పేరుతో యువతులను తీసుకొచ్చి, తర్వాత బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ అక్రమ దందాపై విశాఖ పోలీసులు కన్నెర్ర చేశారు.
Read Also: Hyderabad: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. కత్తితో పొడిచి దారుణ హత్య.. కేసులో బిగ్ట్విస్ట్ ..!
Also Read
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Vizag Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు!
విశాఖలోస్పా పేరుతో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్ను గుర్తించారు పోలీసులు. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో స్పా సెంటర్లలో అనైతిక కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లగ్జరీ వాతావరణం, శారీరక-మానసిక ప్రశాంతత ఇస్తామంటూ మసాజ్ సెంటర్లు వ్యభిచార దందాను యధేచ్చగా సాగిస్తున్నాయి. టాస్క్పోర్స్ పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో అసలు విషయం బయటపడింది.
Read Also:Thalaivar173 : రజనీకాంత్ హీరోగా.. కమల్ హాసన్ నిర్మాతగా దర్శకుడు ఎవరంటే?
సిరిపురం, ద్వారకానగర్, రామ్నగర్, సీతమ్మపేట వంటి ప్రాంతాల్లో స్పాలు ఏర్పాటు చేసి.. వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. రామాటాకీస్లోని ఆర్కిడ్ వెల్ నెస్ స్పా సెంటర్పై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పది మంది యువతులను రెస్క్యూ చేశారు. ముగ్గురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.నిబంధనలకు విరుద్ధంగా స్పాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అందమైన యువతులతో పాటు ఆధునిక సౌకర్యాలతో గదులను అలంకరించి రిలాక్సేషన్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి . హైదరాబాద్, గుంటూరు వంటి నగరాల్లో కూడా స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం దందా సాగుతోంది. నార్త్ ఇండియా, థాయ్లాండ్, ఇతర దేశాల నుంచి యువతులను తీసుకొచ్చి ఈ పనులు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
Read Also:Kidney Stones: ఈ అలవాట్లు మార్చకోకపోతే మీ కిడ్నీలను మర్చిపోవాల్సిందే.. జాగ్రత్త గురూ..!
ఉద్యోగాల పేరుతో యువతులను తీసుకొచ్చి, తర్వాత బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మూసివేసిన గదుల్లో క్రాస్ జెండర్ మసాజ్లు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..