విశాఖలో సైన్స్కు అందని అద్భుతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పునర్జన్మల మీద ఎవరి నమ్మకం వారిది. సైన్స్ కు అందని రహస్యాలు అప్పుడప్పుడు సాక్షాత్కారం అవుతాయి. విశాఖలో అమ్మకు దూరమైన ఇద్దరు చిన్నారులు….సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజే…అదే సమయంలోనే జన్మించారు. మళ్ళీ తమ పిల్లలే తిరిగి పుట్టారని తల్లిదండ్రులు సంతో షంలో వుంటే.. వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే కనిపిస్తోంది. సెప్టెంబరు 15, 2019.. గోదావరి నదీ ప్రమాదాల్లో అతిపెద్ద విషాదం. రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ఠ బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికి పైగా జలసమాధి అయ్యారు.
ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన 3 ఏళ్ల గీతావైష్ణవి, 18 నెలల ధాత్రి అనన్య మృతిచెందారు. బంగారు బొమ్మల్లాంటి పిల్లలను పోగొట్టుకున్న భాగ్యలక్ష్మి, అప్పలరాజు దంపతులకు భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. అప్పటికే భాగ్యలక్ష్మి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది. దీంతో ఇక పిల్లలు పుట్టరని కుంగిపోయారు. మళ్లీ పిల్లలు కావాలనే కోరికతో విశాఖలో ఓ ఐవీఎఫ్ సెంటర్ వైద్యులను సంప్రదించారు. కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా భాగ్యలక్ష్మికి మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. సాధా రణంగా అయితే ఇది సైన్స్ సాధించిన అద్భుతం. కానీ.. భాగ్యలక్ష్మి, అప్పల రాజులకు మాత్రం ఇది దేవుడిచ్చిన వరం. ఎందుకంటే మరణించింది ఇద్దరు ఆడపిల్లలు కాగా….ట్విన్స్ రూపంలో జన్మించింది కూడా ఆడపిల్లలే.
Also Read
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
అదీ ప్రమాదం జరిగిన రోజు…. అదే సమయానికి.ఇది నిజంగా మిరాకిల్ అంటున్నారు డాక్టర్లు. వాస్తవంగా భాగ్యలక్ష్మికి అక్టోబర్లో డెలివరీ అవ్వాల్సి వుంది. గత నెలలో ఒకసారి పురిటినొప్పులు వచ్చాయి. అయితే ప్రీమెచ్యూర్ కావడంతో జాగ్రత్తలు తీసుకుని పురుడు వాయిదా వేశారు వైద్యులు. సెప్టెంబర్ 15, సాయంత్రం సమయంలో ఆపరేషన్ చేసి ఇద్దరు ఆడపిల్లలను బయటకు తీశారు. ఏ సమయానికైతే అమ్మకు పిల్లలు దూరమయ్యారో అదే సమయాకి బిడ్డలు ఒడికి చేరడం నమ్మశక్యం కాని నిజం అంటున్నారు డాక్టర్లు. అద్భుతాలు జరిగేప్పుడు ఎవరు ఊహించరు. అదే భాగ్యలక్ష్మి, అప్పలరాజు విషయంలో జరిగింది. మెడికల్ సైన్స్ ఆ తల్లిదండ్రులకు కొత్త జీవితం ప్రసాధించింది.
- Tags
- Andhra Pradesh
- twins
- visaka
తాజావార్తలు
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
-
Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!