Visakha Garjana: నేడు విశాఖ గర్జన.. మారుమ్రోగనున్న మూడు రాజధానుల నినాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakha Garjana In Vizag Today: వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటోన్న జేఏసీ.. శనివారం విశాఖ గర్జన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా పాల్గొననున్నారు. ఎల్ఐసీ జంక్షన్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు.. సుమారు 4 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో మూడు రాజధానుల నినాదం మారుమ్రోమగనుంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదాన్ని సైతం చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. జేఏసీ చేపడుతోన్న ఈ ర్యాలీకి వైసీపీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే!
రాజకీయాలకు అతీతంగా.. శాంతియుతంగా జరిగే ర్యాలీ ద్వారా ఉత్తరాంద్ర ఆకాంక్షలను దిక్కులు పిక్కటిల్లేలా చెప్తామని జేఏసీ నాయకులు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనాన్ని వివరిస్తూ.. సాంస్కృతిక ప్రదర్శనల్ని సైతం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు, జాతీయ పతాకాలతో 50 మంది స్కెటర్లు ఈ ర్యాలీని లీడ్ చేయనున్నారు. ఈ ర్యాలీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల ముఖ్య నాయకులు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి పలువురు మంత్రులు చేరుకున్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం బీచ్ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో జేఏసీ నాయకులతో పాటు ప్రభుత్వం నుంచి కొద్దిమందికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది.
Also Read
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
మరోవైపు.. ఈ విశాఖ గర్జన కోసం వెయ్యి మందికి పైగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ జరగడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ర్యాలీ కోసం వందలాది వాహనాల్లో తరలివస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక పార్కింగ్ ఏరియాల్ని ఏర్పాటు చేశారు. విశాఖ రీజియన్ పరిధిలో 250 ఆర్టీసీ బస్సులు అద్దెకు వెళ్లాయి.
తాజావార్తలు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?