Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Women Of Thrift Cooperatives Should Do Business Minister Narayana

Minister Narayana: పొదుపు సంఘాల మహిళలు వ్యాపారాలు చేస్తే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది

Published Date :October 29, 2024 , 3:25 pm
By Chandra Shekhar Pamena
  • పీఎం స్వనిధి పథకం సమర్థంగా అమలు చేసిన వారికి జాతీయ- రాష్ట్ర స్థాయి అవార్డులు..
  • మున్సిపాలిటీల కమిషనర్లు- బ్యాంకు అధికారులకు అవార్డులు అందజేసిన మంత్రి నారాయణ..
  • పొదుపు సంఘాల మహిళలు వ్యాపారాలు చేస్తే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది: నారాయణ
Minister Narayana: పొదుపు సంఘాల మహిళలు వ్యాపారాలు చేస్తే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Narayana: పీఎం స్వనిధి పథకం సమర్థంగా అమలు చేసినందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందజేత. 38 మంది అధికారులకు పీఎం స్వనిధి అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పలు మున్సిపాల్టీల కమిషనర్లు, బ్యాంకు అధికారులకు అవార్డులు ప్రకటించారు. ”పీఎం స్వనిధి” పథకం ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్దికి కృషి చేసినందుకు అవార్డులు అందజేత. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను మంత్రి నారాయణ అందించారు. ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడిన లబ్దిదారులను సన్మానించారు మంత్రి.

Read Also: Ghaziabad Court Fight: కోర్టులో రచ్చ.. లాయర్లపై పోలీసుల లాఠీఛార్జి (వీడియో)

Also Read

  • Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
  • V Srinivasa Rao: డీలిమిటేషన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభ‌జ‌న హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
  • YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్‌ జగన్‌ మాజీ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్..
  • Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..

ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నాం.. పీఎం స్వనిధి పథకం కింద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే లక్షల్లో రుణాలు పొందవచ్చు అన్నారు. పథకం కింద లబ్దిదారులకు రుణాలపై కేంద్రం 7శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది అని చెప్పారు. కేవలం 4.5 శాతం వడ్డీ మాత్రమే లబ్దిదారులు భరించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. పేదలంతా పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఎం స్వనిధి పథకం కింద 5 లక్షల 48 వేల 957 దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగూరు నారాయణ చెప్పుకొచ్చారు.

Read Also: Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం.. చేసిందేమీ లేదు..!

ఇక, వచ్చిన దరఖాస్తుల్లో 5 లక్షల 2 వేల 894 మంది పేదలకు రుణాలిచ్చారు అని నారాయణ చెప్పారు. పీఎం స్వనిథి అమలులో జాతీయ స్థాయిలో ఉత్తమ పని తీరు కనపరిచిన అధికారులు, బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు. అవార్డులు గెలిచిన గుంటూరు, పుత్తూరు, రాయచోటి మేజర్ మన్సిపాలిటీ కమిషనర్లకు అభినందనలు.. అత్యుత్తమ పని తీరు కనపరిచి రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించిన పలు మైనర్ మున్సిపాలిటీ కమిషనర్లు, బ్యాంకర్లకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలు వ్యాపారాలు చేస్తే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని సూచనలు చేశారు. పేద మహిళలు లక్షాధికారులు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం.. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Business
  • Minister Narayana
  • Thrift Cooperatives
  • Women

తాజావార్తలు

  • Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?

  • Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!

  • Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..

  • Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?

  • Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!

ట్రెండింగ్‌

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions