CP Rajasekhar Babu: వల్లభనేని వంశీ అరెస్ట్పై సీపీ కీలక వ్యాఖ్యలు.. తప్పించుకోలేరు..!
- వల్లభనేని వంశీ అరెస్ట్ పై విజయవాడ సీపీ కీలక వ్యాఖ్యలు..
- వంశీని పోలీసు కస్టడీకి తీసుకుంటాం..
- వశీ పోలీసు కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం..
- తప్పుచేసినవారు ఎవరూ తప్పించుకోలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Rajasekhar Babu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబు.. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్.. ఆ తర్వాత పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. వంశీని పోలీసు కస్టడీకి తీసుకుంటామని.. దీని కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. వల్లభనేని వంశీరి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాం.. నేరం చేసిన తర్వాత ఎవరూ తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందన్నారు.. ఇప్పుడు కేసుల్లో ఫోన్స్ కాల్స్, సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.. ఇక, వల్లభనేని వంశీ కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.. వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం.. ఇవాళ లేదా రేపు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తామన్నారు.. విచారణలో ఏ కారు ఎక్కడ నుంచి వచ్చింది.. ఎటు వెళ్లింది అనేది టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు విజయవాడ సీపీ రాజశేఖర్బాబు..
Read Also: Happy Valentines Day 2025: ప్రేమించిన వారికి ప్రేమను ఇలా తెలియజేయండి
Also Read
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకుంటూ అఫిడవిట్ దాఖలు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ వ్యవహారంలో వంశీతోపాటు మరికొందరిపై విజయవాడలోని పటమట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించింది కోర్టు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే.. వంశీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను చేర్చారు. సత్యవర్ధన్ను బెదిరించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వంశీ, అతడని అనుచరులు సత్యవర్ధన్ను బెదిరించినట్టు పోలీసులు రిమాండ్లో చేర్చారు. అంతేకాదు.. వంశీకి చట్టాలపై గౌరవం లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!