AP Liquor Scam Case: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కొత్త ఛార్జ్షీట్లో సంచలన అంశాలు..!
- ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం..
- మరో ఛార్జ్ షీటును ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ..
- ఇప్పటికే ప్రైమరీ, రెండో అదనపు ఛార్జిషీట్ దాఖలు..
- తాజాగా మూడో అదనపు ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేసిన సిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ మూడో అదనపు ఛార్జిషీటును ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. జూన్ 19న ప్రైమరీ ఛార్జిషీట్ ను మొదటగా సిట్ దాఖలు చేసింది. ఇందులో కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య పాత్రల గురించి వివరించింది. ఆగస్టు 11వ తేదీన రెండో అదనపు ఛార్జిషీట్ను అధికారులు దాఖలు చేశారు. ఇందులో కేసులో ఏ31గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పల పాత్ర గురించి సిట్ పేర్కొంది. కేసులో మొత్తం 48ని ఇప్పటి వరకు నిందితులుగా చేర్చగా అందులో 29 మంది వ్యక్తులు, 19 సంస్థలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేసులో 12 మందిని సిట్ అరెస్టు చేయగా అందులో నలుగురిని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఏ30గా ఉన్న పైలా దిలీప్ కు రెగ్యులర్ బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. 90 రోజులు జ్యుడీషియల్ కస్టడీ పూర్తి చేసుకున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్డ్ బెయిల్ ను మంజూరు చేసింది.
Read Also: Tollywood : ఈ ఏడాది రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలివే!
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
ఇప్పుడు 90 రోజుల జ్యూడీషియల్ కస్టడీని చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు కూడా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సిట్ తాజాగా మూడో అదనపు ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండటానికి సిట్ అధికారులు ఈ మూడో అదనపు ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. 11 వాల్యూమ్స్ తో 86కి పైగా పేజీలతో మూడో అదనపు చార్జిషీట్ ను సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దీని తర్వాత నాలుగో అదనపు ఛార్జిషీట్ లేదా తుది ఛార్జిషీట్ ను అధికారులు దాఖలు చేయనున్నారు. కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ38గా ఉండగా.. వెంకటేష్ నాయుడు ఏ34గా ఉన్నారు. బాలాజీ కుమార్ యాదవ్ ఏ35గా, నవీన్ కృష్ణ ఏ36గా ఉన్నారు. ఈ ముగ్గురు చెవిరెడ్డి ప్రధాన అనుచరులుగా ఉండి.. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించారనేది సిట్ గుర్తించింది. చార్జి షీట్ అసంపూర్తిగా ఉందని ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయటంతో సిట్ అధికారులు ఈసారి అప్రమత్తమయ్యారు. ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించి ఛార్జ్ షీటును దాఖలు చేశారు.
Read Also: Fee Reimbursement: చర్చలు సఫలం.. నిధులకు పచ్చజెండా.. ప్రైవేట్ కళాశాలల బంద్ విరమణ
లీక్కర్ స్కాం లో వచ్చిన ముడుపుల సొమ్ములో కొంత భాగాన్ని గత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులకు చేరవేయటంతో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఛార్జిషీట్ లో సిట్ పేర్కొన్నట్లు సమాచారం. ముడుపుల సొమ్ము తరలింపు. కలెక్షన్ పాయింట్ లకు చేరవేయటంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర పోషించారని సమాచారం. వెంకటేశ్ నాయుడు కోట్ల రూపాయల డబ్బును లెక్క పెడుతున్న వీడియోలను ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హవాలా మార్గంలో డబ్బులను వెంకటేష్ నాయుడు తెచ్చాడని సిట్ చెబుతోంది. వెంకటేష్ నాయుడుకి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలకు సహకరించారని సిట్.. ఛార్జిషీట్ లో పేర్కొన్నట్టు సమాచారం. తుడాకు చెందిన వాహనాలను కూడా నిందితులు డబ్బు తరలింపుకు వినియోగించినట్టు సిట్ గుర్తించింది. దీంతోపాటు డబ్బును ఎవరెవరికి చేర్చారో కూడా పొందుపరిచారు. దీంతోపాటు నిందితులు సీడీఆర్ లు, మొబైల్ ఎఫ్ ఎస్ఎల్ రిపోర్టులు, సెల్ ఫోన్ టవర్ లోకేషన్లు, టవర్ డంప్ లు, టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రాకపోకల వివరాలు కూడా ఛార్జిషీట్ లో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!