Shakambari Utsavalu 2025: ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు..
- ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకంబరీ మహోత్సవాలు..
- ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakambari Utsavalu 2025: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో విశిష్టంగా నిర్వహించే ఈ మహోత్సవాలు, ఈసారి కూడా ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ అమ్మవారు శాకంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించి, ప్రకృతి మాతగా పూజలందుకుంటున్నారు. మొదటి రోజైన ఈరోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ నిమిత్తంగా సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల సహకారంతో ఈ కూరగాయలు సేకరించబడ్డాయి.
Read Also: YS Jagan: ఇడుపులపాయకు వైఎస్ జగన్
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
ఈ రోజు నుంచి ప్రారంభమైన ఉత్సవాలు జూలై 10వ తేదీతో ముగియనున్నాయి. ఈ మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి విరాళంగా కూరగాయలు సమర్పిస్తూ, శ్రద్ధాభక్తులతో భక్తులు ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ దర్శనలు రద్దు చేశారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా కూరగాయలతో కళకళలాడేలా తీర్చిదిద్దారు.
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!