Liquor Sales: మందుబాబుల్లో కొత్త టెన్షన్.. ఎక్సైజ్ శాఖకు షాక్..!
- కల్తీ మద్యం షాక్తో మందుబాబుల్లో టెన్షన్ ..
- గ్లాస్ ఎత్తేందుకు జంకుతున్న మందుబాబులు..
- తమ ప్రాంతంలో నకిలీ మద్యం సరఫరా జరిగిందేమోఅని ఆందోళన..
- పడిపోయిన రాష్ట్ర మద్యం రెవెన్యూ..
- అమ్మకాలపై గట్టి ప్రభావం చూపిస్తున్న నకిలీ మద్యం ఉదంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: మందుబాబల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.. కల్తీ మద్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం ఖజానాకు గట్టిగానే షాకిస్తోంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో రోజుకు సగటున 78 నుంచి 80 కోట్లు వరకు ఎక్సైజ్ రెవిన్యూ వస్తుంది. అయితే.. కొన్ని రోజులుగా కల్తీ మద్యం భయంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. కొన్ని జిల్లాల్లో రెవిన్యూ డ్రాప్ తీవ్రంగా నమోదైనట్టు సమాచారం. మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గిపోగా, నకిలీ బ్రాండ్ల భయంతో కొంతమంది వినియోగదారులు పూర్తిగా మద్యం కొనడం మానేశారు. దీంతో రోజువారీ రెవిన్యూ లోటుతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గట్టి దెబ్బ తగిలింది.
Read Also: Minister Satya Kumar Yadav: ప్రపంచమంతా మళ్లీ భారతీయ వైద్య విధానం వైపు..
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
కొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం మూలాలు బయటపడుతుండటంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయ్యింది. ల్యాబ్స్, గోడౌన్స్ గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు. వైన్ షాప్స్ పై ఆకస్మిక తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తూ .. నకిలీ మద్యం లిక్కర్ నెట్వర్క్ గుర్తించేందుకు చర్యలు చేపట్టింది ఎక్సైజ్ శాఖ.ప్రజలకు బ్రాండెడ్, నాణ్యమైన మద్యం మాత్రమే వినియోగించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వైన్ షాప్స్, బార్స్ దగ్గర వాతావరణం పూర్తిగా మారిపోయింది.మందుబాబులు.. గ్లాస్ ఎత్తడానికి ముందు ఒకటి, రెండుసార్లు ఆలోచిస్తున్నారు. భయంతో మద్యం వినియోగం తగ్గిపోవడం.. అమ్మకాలపై గట్టి ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా..చిన్న బార్స్, బెల్ట్ షాప్స్ దగ్గర సేల్స్ దారుణంగా తగ్గాయి.ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేల్స్ పడిపోవడంతో వైన్ షాప్స్ యజమానులు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. నకిలీ మద్యం ఎఫెక్ట్తో మద్యం మార్కెట్పైనా గట్టి ప్రభావమే చూపుతోంది. మందుబాబుల సర్కిల్స్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఏది ఒరిజినల్, ఏది నకిలీ అని ఆలోచిస్తున్నారు లిక్కర్ ప్రియులు.
కాగా, కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ1 అద్దేపల్లి జనార్ధన్ చుట్టూ లోతైన విచారణ చేపట్టారు. జనార్ధన్ కు చెందిన ఏఎన్ఆర్ బార్ లైసెన్స్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు కూడా. మరోవైపు భవానీపురం శ్రీనివాస్ వైన్స్ లో కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే బార్ లైసెన్స్ దారుడిని విచారణ జరిపారు పోలీసులు. బార్ మేనేజర్ గా పనిచేసిన కళ్యాణ్ వారానికి 15 కేసులు చొప్పున అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. కళ్యాణ్ తో పాటు ఖాళీ బాటిల్స్ సరఫరా చేసిన శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో అరెస్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. మిగిలిన నిందితుల కోసం అధికారులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!