Vijayawada Floods: నీరు తగ్గిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టిన సర్కార్..
- వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై సర్కార్ ఫోకస్..
- పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులు..
- సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించారు మంత్రి నారాయణ. ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 63 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులుగా నియమించారు.. ఇతర మున్సిపాలిటీల నుంచి సుమారు 4 వేల మంది పారిశుధ్య కార్మికులను బెజవాడకు రప్పిస్తోంది ప్రభుత్వం.. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, గుంటూరు కమిషనర్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: Dunzo: ఏకంగా 75 శాతం ఉద్యోగులను తొలగించిన డన్జో..
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పారిశుధ్య పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద ముంపు ప్రాంతాల్లో ఎంతో కష్టపడి బాధితులను బయటికి తీసుకొచ్చాం. దాదాపు బాధితులందరికీ ఆహారం అందేలా ఏర్పాట్లు చేశాం. ఇవాళ 8.5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు టిఫిన్ కోసం, మరో 8.5 లక్షల అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశాం. 5 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని వివరించారు. నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాం. ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10 వేల మంది కార్మికులు అవసరం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల కమిషనర్లకు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం అన్నారు.. ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేకాధికారి ఉంటారు. వరద నీరు తగ్గగానే ఫైర్ డిపార్ట్మెంటుతో కలిసి ట్యాంకర్లతో రోడ్లు శుభ్రం చేస్తాం. బ్లీచింగ్, ఫాగింగ్ పనులు వెంటనే చేపడతాం. వైద్యారోగ్య శాఖతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని వివరించారు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!