NTV Telugu Site icon

Vijayawada: ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కీలక పరిణామం..

Icici Bank

Icici Bank

ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బ్యాంక్ మాజీ మేనేజర్ నరేష్ ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. నరేష్ భార్య కుటుంబ సభ్యుల నుంచి సీఐడీ వివరాలు సేకరించింది. ఇప్పటికే నరేష్ కనిపించటం లేదని బెజవాడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నరేష్ దేశం దాటినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా.. మూడ్రోజుల క్రితం నరేష్ భార్య సరోజినీ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు పటమట పోలీసులు. గత నెల 26న హైదరాబాద్ వెళ్ళాడని.. 28న ఫోన్ చేసి డబ్బులు రావల్సిన పని అవటం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు భార్య ఫిర్యాదు చేసింది.

Read Also: German Railways: భారత్‌ నుంచి లోకో పైలట్‌లను రిక్రూట్ చేసుకున్న జర్మన్ రైల్వే..

గత పదిరోజుల క్రితం పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన మూడు శాఖల్లో సుమారు రూ.28 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నేర పరిశోధన విభాగం (సీఐడీ) దీనిపై దర్యాప్తు చేపట్టింది. చిలకలూరిపేట బ్రాంచ్‌లో ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించి.. అక్రమాలకు పాల్పడిన ఖాతాదారుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. కీలక సూత్రధారి అయిన బ్యాంక్‌ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్‌ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అప్పటి నుంచి నరేష్ ఆచూకీ లేదు.

Read Also: Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్‌కి తీవ్ర అస్వస్థత.. ఇజ్రాయిల్ దాడి తర్వాత కీలక విషయం..