Big Relief To MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి..!
- ఎంపీ మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట..
- న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన ఏసీబీ న్యాయస్థానం..
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ 4గా ఉన్న మిథున్ రెడ్డి..
- న్యూయార్క్ వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Relief To MP Mithun Reddy: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. న్యూయార్క్ వెళ్లేందుకు మిథున్ రెడ్డికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ 4గా ఉన్న మిథున్ రెడ్డి.. బెయిల్పై విడుదలయ్యారు. అయితే, ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.. 50,000 రూపాయల విలువచేసే రెండు జమీన్లను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక, న్యూయార్క్ లో ఎక్కడ బస చేస్తున్నారు అనే వివరాలను కోర్టుకు అందజేయాలని ఆదేశాల్లో పేర్కొంది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం..
Read Also: Vijayawada: విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో ప్రభుత్వ చర్చలు.. కీలక నిర్ణయాలపై దృష్టి!
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
కాగా, ఏపీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. అమెరికాలోని న్యూయార్క్ పర్యటనకు అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. దీంతో, ఈ పిటిషన్పై తీర్పును శుక్రవారం వెలువరిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.. దానికి అనుగుణంగా ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట కల్పిస్తూ.. న్యూయార్క్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు.. అయితే అక్టోబర్ 26వ తేదీన అమెరికా వెళ్లనున్న పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఎంపీ మిథున్ రెడ్డి పేరు ఉన్న విషయం తెలిసిందే..
తాజావార్తలు
-
Varanasi: జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..‘వారణాసి’ యాక్షన్ ఎపిసోడ్స్పై క్రేజీ బజ్
-
Kamakshi: “సెక్స్ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!