Bhavani Deeksha Viramana: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భవానీలు.. దీక్షల విరమణ ప్రారంభం..
- బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష విరమణలు..
- ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhavani Deeksha Viramana: బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి.. ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు జరగనున్నాయి.. దీంతో సుమారు రోజుకి 50 వేలకు మంది పైగా భక్తులు వస్తారన్న అంచనా వేస్తున్నారు అధికారులు.. 7 లక్షల మంది భవానీ దీక్షాధారులు ఐదు రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, ఇరుముడులు మల్లికార్జున మహా మండపంలో సమర్పించే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.. తొలి రోజున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ ఇచ్చిన తర్వాత అంటే ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు అధికారులు.. ఇక, భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు..
Read Also: TG Rythu Bharosa: సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల..? నేడు సభలో చర్చ..
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుండి భవాని దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమయ్యాయి.. 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు భవాని దీక్ష విరమణలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం అన్నారు సీపీ రాజశేఖర్బాబు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఏడాది 7 లక్షల పై చీలుక భవానీలు వస్తారని అంచనా వేస్తున్నాం.. భవానీలు మాల విరమణ కోసం రెండు హోమగుండాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.. భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు.. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి మానిటర్ చేస్తున్నాం.. సుమారుగా 1900 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.. భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్ష విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఆయన.. కంట్రోల్ కమాండింగ్ ద్వారా భవానీలను మోనిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నాం అన్నారు.. భవానీ దీక్ష విరమణ సంబంధించి సంయుక్తంగా ఏర్పాట్లు చేశాం.. కమాండ్ కంట్రోల్స్ ద్వారా సాంకేతికంగా ముందుకు పోతున్నాం.. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ తేలికగా మారింది.. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది పకడ్బందీగా వ్యవస్థని పటిష్టం చేశామని తెలిపారు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!