Bhavani Deeksha Viramana: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భవానీలు.. దీక్షల విరమణ ప్రారంభం..
- బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష విరమణలు..
- ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhavani Deeksha Viramana: బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి.. ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు జరగనున్నాయి.. దీంతో సుమారు రోజుకి 50 వేలకు మంది పైగా భక్తులు వస్తారన్న అంచనా వేస్తున్నారు అధికారులు.. 7 లక్షల మంది భవానీ దీక్షాధారులు ఐదు రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, ఇరుముడులు మల్లికార్జున మహా మండపంలో సమర్పించే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.. తొలి రోజున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ ఇచ్చిన తర్వాత అంటే ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు అధికారులు.. ఇక, భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు..
Read Also: TG Rythu Bharosa: సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల..? నేడు సభలో చర్చ..
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుండి భవాని దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమయ్యాయి.. 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు భవాని దీక్ష విరమణలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం అన్నారు సీపీ రాజశేఖర్బాబు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఏడాది 7 లక్షల పై చీలుక భవానీలు వస్తారని అంచనా వేస్తున్నాం.. భవానీలు మాల విరమణ కోసం రెండు హోమగుండాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.. భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు.. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి మానిటర్ చేస్తున్నాం.. సుమారుగా 1900 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.. భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్ష విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఆయన.. కంట్రోల్ కమాండింగ్ ద్వారా భవానీలను మోనిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నాం అన్నారు.. భవానీ దీక్ష విరమణ సంబంధించి సంయుక్తంగా ఏర్పాట్లు చేశాం.. కమాండ్ కంట్రోల్స్ ద్వారా సాంకేతికంగా ముందుకు పోతున్నాం.. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ తేలికగా మారింది.. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది పకడ్బందీగా వ్యవస్థని పటిష్టం చేశామని తెలిపారు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.
తాజావార్తలు
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!