Compensation to Flood Victims: వరద బాధితులకు గుడ్న్యూస్.. 4 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ..
- వరద బాధితులకు గుడ్న్యూస్..
- బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసిన ప్రభుత్వం..
- వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..
- 4 లక్షల మంది బాధితల ఖాతాల్లో రూ. 602 కోట్లు జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Compensation to Flood Victims: వరద బాధితులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం అన్నారు.. నాలుగు లక్షల మందికి రూ. 602 కోట్లు బాధితుల అకౌంట్లలో వేశామని తెలిపారు.. ఇప్పటి వరకు నేను చూడని విపత్తు ఇది. బుడమేరులో ఎప్పుడూ చూడని వరద. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మోడ్రనైజేషన్ పనులు నిలిపేసింది. బుడమేరు కబ్జాకు గురైంది. మరో వైపు కృష్ణా నదిలో పెద్ద ఎత్తున వరద. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా పేర్కొన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
ప్రకృతి ప్రకోపం.. లేదా ప్రకృతితో మనం ఆడుకున్నప్పుడో ఇలాంటి అకాల వరదలు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు.. దీనికి తోడు గత పాలకుల పాపాలు కూడా వరద తీవ్రత పెరగడానికి తోడయ్యాయి. వరద సమస్య.పరిష్కారం కాదని.. కలక్టరేట్లోనే మకాం వేశాను. బాధితులు మంచి నీళ్లు అడిగినా ఇవ్వలేని నిస్సహయ స్థితిలో సీఎంగా ఉన్న నేనే ఉండిపోయాను. సింగ్ నగర్ లో పర్యటించిన వెంటనే కేంద్ర పెద్దలతో మాట్లాడాను. వరద ప్రాంతాల్లో రోజుల వారీ తిరిగాను. వీలున్నంత వరకు ప్రాణ నష్టం తగ్గించగలిగాం. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను బాధితులకు కల్పించాం. 1.15 కోట్ల ఫుడ్ ప్యాకెట్లు, 5 వేల క్వింటాళ్ల కూరగాయలు సరఫరా చేశాం. ఫైరింజన్లతో 75 వేల ఇళ్లను శుభ్రం చేయించాం. 20 వేల మెట్రిక్ టన్నుల చెత్తని తొలగించాం. 2.50 లక్షల కరెంట్ కనెక్షన్లు తక్కువ సమయంలో పునరుద్దరించాం. ఈ అనుభవంతో భవిష్యత్తులో ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా ఎదుర్కోగలిగే అనుభవం వచ్చిందని తెలిపారు చంద్రబాబు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
రూ. 400 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. విరాళాలిచ్చిన దాతలకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు సీఎం చంద్రబాబు.. వీల్ ఛైర్లో వచ్చారు.. ఎన్ఆర్ఐలు, చిన్నారులు ముందుకొచ్చి విరాళాలిచ్చారు. చదువుకునే పిల్లలు కూడా సాయం అందించారు. సాటి వారికి సాయపడాలనే తపనతో చిన్నారులు కూడా స్పందించారు. రూ. 6700 కోట్ల నష్టం జరిగిందని.. ప్రభుత్వం రూ. 602 కోట్ల మేర సాయం అందిస్తోందన్నారు. దాతల నుంచే సుమారు రూ. 400 కోట్లు ఇచ్చారు. సంఘటితంగా ఉంటే ఎంతటి విపత్తు అయినా ఎదుర్కొగలమనే నమ్మకాన్ని పెరిగిందన్నారు.. 16 జిల్లాల్లో వరద, వర్ష ప్రభావం ఉంది. అందరికీ ఒకేసారి సాయం అందించామని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
-
Nepal Gorkhas: “మేము భారత సైన్యంలో చేరుతాం”.. నేపాల్లో రోడ్డెక్కిన యువత
-
AI Jobs Impact: AI ప్రభావం.. 9.2 కోట్ల ఉద్యోగాలు మాయం.. కానీ, 17 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు
-
CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!