Vijayasai Reddy: రూ.2 వేల నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Tweet On 2000 Note Withdrawn: శుక్రవారం సాయంత్రం రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే! క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాదు.. రూ.2 వేల నోట్లను సర్క్యులేషన్లో ఉంచొద్దని బ్యాంకులకు ఆదేశం ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ 2 వేల నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు తెలిపారు. తాము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ట్విటర్ మాధ్యమంగా తెలిపారు. నల్ల ధనాన్ని అరికట్టే చర్యలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని.. అందులో భాగంగానే రూ.2 వేల నోట్లను రద్దు చేయాలన్న ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
Kavya Thapar: రెడ్ డ్రెస్ లో ‘బిచ్చగాడు 2’ బ్యూటీ సెగలు పుట్టిస్తుందిగా
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
కాగా.. ఈ 2 వేల నోట్లను మార్చుకోవాలంటే, దగ్గరలో ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. అందుకు ఆ బ్యాంక్ వాళ్లు మనకు రూ. 500, రూ.100 నోట్ల కింద తిరిగి చెల్లిస్తారు. అలా కాకుండా నేరుగా మన బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసినా సరిపోతుంది. అయితే.. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో విడతలో, అంటే రోజుకి 10 నోట్లు మాత్రమే మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలుంటుంది. సెప్టెంబర్ 30 దాకా మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఆందోళన చెందకుండా ఆలోపు వీలున్నప్పుడు నోట్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా లేకపోతే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి, అక్కడ రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. ఇదిలావుండగా.. 2016 నవంబర్ నోట్ల రద్దుని ప్రకటించినప్పుడు.. రూ.2 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారు. క్రమంగా ఈ నోట్ల చలామణి తగ్గడంతో, ఆర్బీఐ 2018-19లో ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఇప్పుడు వీటిని పూర్తిగా రద్దు చేస్తూ.. ప్రకటన జారీ చేసింది.
AP BJP: ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం.. క్లాస్ పీకిన ప్రధాన కార్యదర్శి
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!