Vijayasai Reddy: రూ.2 వేల నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Tweet On 2000 Note Withdrawn: శుక్రవారం సాయంత్రం రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే! క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాదు.. రూ.2 వేల నోట్లను సర్క్యులేషన్లో ఉంచొద్దని బ్యాంకులకు ఆదేశం ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ 2 వేల నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు తెలిపారు. తాము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ట్విటర్ మాధ్యమంగా తెలిపారు. నల్ల ధనాన్ని అరికట్టే చర్యలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని.. అందులో భాగంగానే రూ.2 వేల నోట్లను రద్దు చేయాలన్న ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
Kavya Thapar: రెడ్ డ్రెస్ లో ‘బిచ్చగాడు 2’ బ్యూటీ సెగలు పుట్టిస్తుందిగా
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
కాగా.. ఈ 2 వేల నోట్లను మార్చుకోవాలంటే, దగ్గరలో ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. అందుకు ఆ బ్యాంక్ వాళ్లు మనకు రూ. 500, రూ.100 నోట్ల కింద తిరిగి చెల్లిస్తారు. అలా కాకుండా నేరుగా మన బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసినా సరిపోతుంది. అయితే.. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో విడతలో, అంటే రోజుకి 10 నోట్లు మాత్రమే మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలుంటుంది. సెప్టెంబర్ 30 దాకా మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఆందోళన చెందకుండా ఆలోపు వీలున్నప్పుడు నోట్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా లేకపోతే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి, అక్కడ రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. ఇదిలావుండగా.. 2016 నవంబర్ నోట్ల రద్దుని ప్రకటించినప్పుడు.. రూ.2 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారు. క్రమంగా ఈ నోట్ల చలామణి తగ్గడంతో, ఆర్బీఐ 2018-19లో ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఇప్పుడు వీటిని పూర్తిగా రద్దు చేస్తూ.. ప్రకటన జారీ చేసింది.
AP BJP: ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం.. క్లాస్ పీకిన ప్రధాన కార్యదర్శి
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!