Vijayasai Reddy: రూ.2 వేల నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Tweet On 2000 Note Withdrawn: శుక్రవారం సాయంత్రం రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే! క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాదు.. రూ.2 వేల నోట్లను సర్క్యులేషన్లో ఉంచొద్దని బ్యాంకులకు ఆదేశం ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ 2 వేల నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు తెలిపారు. తాము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ట్విటర్ మాధ్యమంగా తెలిపారు. నల్ల ధనాన్ని అరికట్టే చర్యలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని.. అందులో భాగంగానే రూ.2 వేల నోట్లను రద్దు చేయాలన్న ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
Kavya Thapar: రెడ్ డ్రెస్ లో ‘బిచ్చగాడు 2’ బ్యూటీ సెగలు పుట్టిస్తుందిగా
Also Read
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
కాగా.. ఈ 2 వేల నోట్లను మార్చుకోవాలంటే, దగ్గరలో ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. అందుకు ఆ బ్యాంక్ వాళ్లు మనకు రూ. 500, రూ.100 నోట్ల కింద తిరిగి చెల్లిస్తారు. అలా కాకుండా నేరుగా మన బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసినా సరిపోతుంది. అయితే.. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో విడతలో, అంటే రోజుకి 10 నోట్లు మాత్రమే మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలుంటుంది. సెప్టెంబర్ 30 దాకా మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఆందోళన చెందకుండా ఆలోపు వీలున్నప్పుడు నోట్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా లేకపోతే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి, అక్కడ రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. ఇదిలావుండగా.. 2016 నవంబర్ నోట్ల రద్దుని ప్రకటించినప్పుడు.. రూ.2 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారు. క్రమంగా ఈ నోట్ల చలామణి తగ్గడంతో, ఆర్బీఐ 2018-19లో ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఇప్పుడు వీటిని పూర్తిగా రద్దు చేస్తూ.. ప్రకటన జారీ చేసింది.
AP BJP: ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం.. క్లాస్ పీకిన ప్రధాన కార్యదర్శి
తాజావార్తలు
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!