VijaySai Reddy: ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి సుదీర్ఘమయిన సముద్రతీరం వుంది. తుఫానులు, భారీవర్షాలు కురిస్తే తీరప్రాంతం వణికిపోతుంటుంది. ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు వుందని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న తీర ప్రాంతం 20 శాతం పైనే ఉన్నట్లుగా ఇంకాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) అధ్యయనంలో తేలినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.
రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్కాయిస్ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు. కోత ముప్పు అతి తీవ్రస్థాయిలో ఉన్న ప్రాంతం 0.55 శాతం ఉన్నట్లు మంత్రి చెప్పారు. సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్)కి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో వేయి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. జాతీయ స్థాయిలో నేషనల్ డిసాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సంస్థను నెలకొల్పి 2021-22 నుంచి 2025-26 కాలానికి ఈ సంస్థకు 68 వేల 463 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
ఈ నిధిని ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఎఫ్ సంస్థలకు 80-20 నిష్పత్తిలో విభజించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఎన్డీఎంఎఫ్ను నెలకొల్పింది. ఇలాంటి సంస్థలనే ఎస్డీఎంఎఫ్ పేరిట ఏర్పాటు చేయవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సలహా మేరకు ఇప్పటికి 21 రాష్ట్రాలు ఎస్డీఎంఎఫ్లను ఏర్పాటు చేశాయని మంత్రి వివరించారు. సముద్ర కోతల వలన తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తూ సాంకేతికపరమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయని ఆయన చెప్పారు.
Chandan Kumar: తెలుగు డైరెక్టర్స్ కే పొగరు చూపించిన కన్నడ హీరో.. చివరికి ఇలా
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!