Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vidadala Rajini On Medical And Health Feciities

Vidadala Rajini: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

Published Date :August 27, 2022 , 9:48 pm
By NTV WebDesk
Vidadala Rajini: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ఏటా 16 వేల కోట్ల రూపాయల నిధులను వైద్య ఆరోగ్యశాఖకు కేటాయిస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ, పట్టణాలలో హెల్త్ సెంటర్లు నిర్మాణానికి మరియు కొత్త హాస్పటల్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె అన్నారు. శనివారం వినుకొండ పట్టణంలోని స్థానిక ఎన్ఎస్పి కాలనీ ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నాటి ప్రభుత్వ హయాంలో కన్న నేడు ప్రజలకు సంక్షేమము, వైద్యము మరియు విద్య అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 1145 ఆసుపత్రులలో 977 ఆసుపత్రులను పునర్ నిర్మిస్తున్నట్టు, 175 కొత్త ఆసుపత్రులను నిర్మాణం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 477 కోట్లతో ఆసుపత్రులను నిర్మాణం చేస్తున్నామని 253 కోట్లతో కొత్తగా హాస్పిటల్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో 560 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వాటికోసం 400 కేంద్రాలను పునర్మిస్తున్నామని 144 కేంద్రాలను కొత్తగా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను నిర్మాణం చేయడానికి 348 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 16 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు మంజూరు కాగా, వినుకొండ పట్టణంలో నేడు ప్రారంభించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదటిగా నిర్మాణం పూర్తి చేసుకుందని అందుకే ఎంతో సంతోషిస్తున్నానని ఆమె తెలిపారు.

అదే విధంగా వినుకొండలో వున్న ముప్పై పడకల ఆసుపత్రిని అతి త్వరలోనే వంద పడకల ఆసుపత్రిగా మార్చనున్నట్లు వినుకొండకు ట్రామా అండ్ ఎమర్జెన్సీ సెంటర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ళ బాలుడికి బోన్ మ్యారో ట్రాన్స్పటేషన్ (కాన్సర్) సర్జరీ అత్యవసరంగా చేయవలసి ఉందని దానికి 35 లక్షల ఖర్చు అవుతుందని బాలుడి తల్లి చేసిన విజ్ఞప్తి మేరకు ఆ బాలుడికి కావాల్సిన చికిత్సను అందించడానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని దానిలో భాగంగా నేడు ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ను అనుకున్న సమయంలో పూర్తిచేసి జిల్లాలోనే మొదటిగా ప్రారంభించడం సంతోషపడుతున్నామని తెలిపారు.

Read Also: Botsa Satyanarayana: ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ నకు అదనపు తరగతుల నిర్మాణం కోసం నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మాణం చేస్తున్నట్లు 2.80 లక్షల నిధులతో నిర్మాణం చేయడానికి ఎకరంన్నర స్థలంలో శంకుస్థాపన చేశారు. రైతు బజారుకు ఎకరం స్థలంలో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిలో మంత్రి విడదల రజిని, జిల్లా కలెక్టర్ శివశంకర్, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ తదితరుల తోడ్పాటు ఎంతో ముఖ్యమైనదని అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే నియోజకవర్గంలో పేద రైతులకు ప్రభుత్వ భూములను అందించనున్నట్లు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • cm jaganmohan reddy
  • Health Services
  • naadu nedu
  • vidadala rajini

తాజావార్తలు

  • Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

  • Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

  • Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

  • Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions