Varla Ramaiah: ఆ అప్రూవర్కి రక్షణ కల్పించాలంటూ డీజీపీకి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తిగిరికి, అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకి రక్షిణ కల్పించాలంటూ.. టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారినప్పటి నుంచి అతనికి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే.. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అతనిపై తప్పులు కేసులు బనాయిస్తున్నారని, చివరికి సీబీఐ బృందాన్ని కూడా విడిచిపెట్టడం లేదని అన్నారు. సీబీఐ దర్యాప్తు అధికారిపై కూడా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా.. సీబీఐ టీమ్పై బాంబులు విసురుతామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారని వర్ల రామయ్య ఆరోపించారు.
వివేకా హత్యకేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల.. వారి ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రజల్లోనూ అదే అభిప్రాయం ఉందని వర్ల రామయ్య తెలిపారు. వివేకా హత్యకు కారకులైన నిందితులపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి, అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకి సరైన భద్రత, రక్షణ కల్పించడం చాలా ముఖ్యమన్నారు. దస్తగిరికి గానీ, సీబీఐ దర్యాప్తు అధికారులకు గానీ ఏదైనా హాని జరిగితే.. అందుకు వైసీపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాల మేర కాకుండా.. రాజ్యాంగం ప్రకారం పోలీసులు నడుచుకోవాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!