Varla Ramaiah : పురుషులను చూస్తేనే ఆమె భయంతో వణికిపోతోంది
ఆంధ్రప్రదేశ్ లో మహిళల చిన్నారులపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైసిపి ప్రభుత్వాన్ని టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో సామూహిక అత్యాచారానికి గురైన దళిత గర్భిణిని ఆదుకోవాలని వైసిపి ప్రభుత్వాన్ని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. బాధితురాలికి తక్షణమే కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రామయ్య లేఖ రాసారు.
కట్టుకున్న భర్త, కన్నబిడ్డల ముందే మృగాళ్ల చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైన మహిళ ప్రస్తుతం ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతోన్న రేపల్లు అత్యాచార బాధితురాలిని వర్ల రామయ్యతో పాటు టిడిపి నాయకులు పరామర్శించారు. బాధిత మహిళ యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వ నిర్బంధాన్ని ఛేదించుకుని హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చిందని వర్ల రామయ్య మండిపడ్డారు.
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
అతి దారుణంగా లైంగిక దాడికి గురయిన బాధిత మహిళ పురుషులను చూస్తేనే భయంతో వణికిపోతోందని ఆయన అన్నారు. ఆమె మానసిక స్థితి చూస్తే ఎంత చిత్రవధ అనుభవించిందో అర్థమవుతుందన్నారు. రైల్వేస్టేషన్ లో గ్యాంగ్ రేప్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని బట్టే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్ధమవుతుందన్నారు.
తల్లిదండ్రులు పెంపకం సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని హోంమంత్రి తానేటి వనిత మాట్లాడటం బాధ్యతారాహిత్యమని వర్ల మండిపడ్డారు. లేని దిశా చట్టం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప మహిళల భద్రత కోసం నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నట్లుగా కనిపించడంలేదన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన వారికి సీఏం కోటి రూపాయల పరిహారం ఇచ్చారు… కానీ, గ్యాంగ్ రేప్కు గురైన ఎస్సీ మాదిగ మహిళకు కేవలం 4.12 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అత్యంత అమానవీయం అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పరిహారం ఏ రూపంలో, ఎక్కడ ఇచ్చారో క్లారిటీ లేదన్నారు. దీన్ని బట్టే ఎస్సీ మహిళలపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏ..పాటిదో అర్ధమవుతోందన్నారు.
బాధిత మహిళ కుటుంబం వారి స్వస్థలానికి వెళ్లి పనులు చేసుకునే పరిస్థితులు లేవన్నారు రామయ్య. కాబట్టి ప్రభుత్వం ఆ బాధితురాలికి తక్షణమే కోటి రూపాయల ఆర్థిక సాయం, 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు ఇచ్చి సామాజికంగా, ఆర్థికంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ లేఖ ద్వారా సీఎం వైఎస్ జగన్ ను కోరారు రామయ్య. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘోరాలు జరగకుండా వైసిపి ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.
Taneti Vanita: పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా చంద్రబాబూ?
తాజావార్తలు
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’
-
Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్లో నేటి రేట్స్ ఇవే!
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విధ్వంసమే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!