NTV Telugu Site icon

Vizianagaram SP: వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారం కోసమే హత్య..

Sp Jindal

Sp Jindal

Vizianagaram SP: విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని ముగడ కాలనీలో దారుణం జరిగింది. ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు గద్దె కృష్ణవేణిని దొంగలు దారుణంగా చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, వృద్దరాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. వృద్ధురాలి ఇంటి పక్కన ఉంటున్న కలిశెట్టీ లలిత కుమారి అనే మహిళే హత్యకు పాల్పడిందన్నారు. డబ్బు అవసరం కావడంతో.. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై కన్నేసింది.. వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారం, డబ్బు కాజేయడానికి ప్లాన్ చేసింది.. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి 14.5 తులాల బంగారం దోచుకుని వెళ్లింది అని ఎస్పీ జిందాల్ పేర్కొన్నారు. కాగా, క్లూస్ టీమ్, టెక్నికల్ ఏవిడెన్స్ సహాయంతో కేసును చేదించామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. హత్య చేసిన తర్వాత బంగారం దోచుకుని విశాఖ జిల్లా కంచరపాలెం వెళ్ళిపోయింది.. వెంటనే ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని.. దోచుకెళ్లిన సొత్తును రికవరీ చేశామన్నారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు.

Read Also: Thangalaan: మొదటి రోజే విక్రమ్ తంగలాన్ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

అలాగే, రామ భద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ లో భాగంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాం అని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఒడిస్సా నుంచి విశాఖకు తరలిస్తున్న 20 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకునీ వాహనదారుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నామ్.. బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో గంజాయి తరలిస్తున్న ఎనిమిది మందిని పట్టుకున్నామని చెప్పుకొచ్చారు. వారి వద్ద నుండి 16 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నాం.. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు.. బొబ్బిలిలో గంజాయి కొని బెంగుళూరు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు.. ఒడిస్సా నుండి గంజాయిని తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు.. గంజాయి కొనే వారిని.. అమ్మేవారిని.. వారి వెనుక ఉన్న వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నామని వకుల్ జిందాల్ వెల్లడించారు.