Godavari Floods Crop Loss: వరదలతో లంక రైతులకు తీరని నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేతికొచ్చే పంట వరద నీటి పాలైంది… వరదల్లో తేలుతున్న పంటను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. భారీవర్షాలు, వరదలు లంక రైతులకు కష్ట కాలం తెచ్చిపెట్టాయి. వేలాది ఎకరాల్లో పంట గోదావరి పాలయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వరద ముంపులోనే ఉన్న పంటలు ఒక్కొక్కటి తేలుతున్నాయి. కుళ్ళిపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. అన్ని రకాల పంటలకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే రైతులు అంతా ఇలాంటి దయనీయ పరిస్థితిని వరదల వల్ల ఎదుర్కొన్నారు.
నిత్యం పూల తోటలు, కూరగాయలు,వాణిజ్య పంటలతో కళకళలాడుతుండే గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఇప్పుడు మోడువారింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక, బుర్రిలంక, పొట్టిలంక, వేమగిరి లంక ప్రాంతాలు కళావిహీనంగా మారాయి. కనుచూపుమేరలో రంగురంగుల పూల తోటలతో నిండి ఉండే ఈ లంక ఇప్పుడు మసిబారింది. పంటలన్నీ వరద నీటిలో కుళ్లిపోయాయి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు మిగిల్చాయి. ఏటా ఆగస్టులో వచ్చే వరదలు జూలై నెలలో వచ్చి పడడంతో ఈ అపార నష్టానికి కారణంగా పేర్కొనవచ్చు.
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్పై ఫోకస్
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
వరదలు ఆగష్టులో వస్తాయని రైతులు ముందుగానే తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఈ రకంగా ప్రతి ఏటా జూలై నెలాఖరుకు వేసిన పంటలను దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రైతులకు ఆవకాశం ఇవ్వకుండా జూలై 11నే వరదలు ముంచెత్తడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ లంక భూముల్లో బంతి, లిల్లీ, మల్లి, కనకాంబరం, జాజులు,గులాబీ వంటి పూల తోటలు ఉన్నాయి. అలాగే దొండ, బెండ, పొట్ల, కాకర, ఆనప, మిరప వంటి కూరగాయ పంటలు అరటి, బొప్పాయి, జామ, కంద వంటి వాణిజ్య పంటలను ఈ వరద గోదారమ్మ ముంచెత్తింది.
ఈ పంటలేగాక ఇటీవల కాలంలో లంకల్లో కూడా నర్సరీ మొక్కల పెంపకం అధికమైంది. వరదలు వచ్చే సమయం ఇంకా దగ్గర పడకపోవటంతో అందరూ ఈ లంకలోనే పెంచిన మొక్కలను ఉంచేశారు. ఇంతలోనే గోదారమ్మ ముంచేయడంతో వారంతా తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులుతో పెంచిన మొక్కలు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఇప్పుడు రైతులు పాడైపోయిన మొక్కలు తొలగించడానికి కూడా ఎంతో వ్యయ ప్రయాణపు పడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం తగిన నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు, కౌలు రైతులు కోరుకుంటున్నారు.
Sravana Bhargavi: ఎట్టకేలకు వివాదాస్పద వీడియో డిలీట్ చేసిన టాలీవుడ్ సింగర్
తాజావార్తలు
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?