Godavari Floods Crop Loss: వరదలతో లంక రైతులకు తీరని నష్టం
చేతికొచ్చే పంట వరద నీటి పాలైంది… వరదల్లో తేలుతున్న పంటను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. భారీవర్షాలు, వరదలు లంక రైతులకు కష్ట కాలం తెచ్చిపెట్టాయి. వేలాది ఎకరాల్లో పంట గోదావరి పాలయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వరద ముంపులోనే ఉన్న పంటలు ఒక్కొక్కటి తేలుతున్నాయి. కుళ్ళిపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. అన్ని రకాల పంటలకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే రైతులు అంతా ఇలాంటి దయనీయ పరిస్థితిని వరదల వల్ల ఎదుర్కొన్నారు.
నిత్యం పూల తోటలు, కూరగాయలు,వాణిజ్య పంటలతో కళకళలాడుతుండే గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఇప్పుడు మోడువారింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక, బుర్రిలంక, పొట్టిలంక, వేమగిరి లంక ప్రాంతాలు కళావిహీనంగా మారాయి. కనుచూపుమేరలో రంగురంగుల పూల తోటలతో నిండి ఉండే ఈ లంక ఇప్పుడు మసిబారింది. పంటలన్నీ వరద నీటిలో కుళ్లిపోయాయి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు మిగిల్చాయి. ఏటా ఆగస్టులో వచ్చే వరదలు జూలై నెలలో వచ్చి పడడంతో ఈ అపార నష్టానికి కారణంగా పేర్కొనవచ్చు.
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
వరదలు ఆగష్టులో వస్తాయని రైతులు ముందుగానే తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఈ రకంగా ప్రతి ఏటా జూలై నెలాఖరుకు వేసిన పంటలను దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రైతులకు ఆవకాశం ఇవ్వకుండా జూలై 11నే వరదలు ముంచెత్తడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ లంక భూముల్లో బంతి, లిల్లీ, మల్లి, కనకాంబరం, జాజులు,గులాబీ వంటి పూల తోటలు ఉన్నాయి. అలాగే దొండ, బెండ, పొట్ల, కాకర, ఆనప, మిరప వంటి కూరగాయ పంటలు అరటి, బొప్పాయి, జామ, కంద వంటి వాణిజ్య పంటలను ఈ వరద గోదారమ్మ ముంచెత్తింది.
ఈ పంటలేగాక ఇటీవల కాలంలో లంకల్లో కూడా నర్సరీ మొక్కల పెంపకం అధికమైంది. వరదలు వచ్చే సమయం ఇంకా దగ్గర పడకపోవటంతో అందరూ ఈ లంకలోనే పెంచిన మొక్కలను ఉంచేశారు. ఇంతలోనే గోదారమ్మ ముంచేయడంతో వారంతా తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులుతో పెంచిన మొక్కలు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఇప్పుడు రైతులు పాడైపోయిన మొక్కలు తొలగించడానికి కూడా ఎంతో వ్యయ ప్రయాణపు పడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం తగిన నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు, కౌలు రైతులు కోరుకుంటున్నారు.
Sravana Bhargavi: ఎట్టకేలకు వివాదాస్పద వీడియో డిలీట్ చేసిన టాలీవుడ్ సింగర్
తాజావార్తలు
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
-
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!