Amaranath Yatra: ఇద్దరు ఏపీ యాత్రికులు గల్లంతు.. ఏపీ సర్కార్ ప్రకటన
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరనాథ్లో యాత్ర తీవ్ర విషాదం నింపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మికంగా ముంచెత్తిన వరదలతో భారీగా ప్రాణనష్టం కలిగింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం అమర్నాథ్ యాత్రలో తలెత్తిన ఈ ప్రకృతి విపత్తుకు 15 మంది యాత్రికులు మృతి చెందినట్లు ఏపి ప్రభుత్వ ఉన్నతాధికారి హిమాంశ్ కౌశిక్ వెల్లడించారు. ఇప్పటివరకు అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం, జల విలయంలో మొత్తం 15 మంది యాత్రికులు మృతి చెందారని.. 37 మంది ఆచూకీ గల్లంతు అయినట్లు ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారి హిమాంశ్ కౌశిక్ ప్రకటించారు. ఆచూకి గల్లంతైన యాత్రికుల సంఖ్య ఈ రోజు సాయంత్రం వరకు మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Amarnath Yatra: అమర్ నాథ్లో సహాయకచర్యలు.. ఏపీ వాసులు సేఫ్
Also Read
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ఆచూకీ గల్లంతైన వారిలో 16 మంది తెలుగు యాత్రికులు ఉన్నారని.. వీరిలో ఇప్పటివరకు 14 మంది క్షేమంగా ఉన్నారని… కేవలం ఇద్దరు తెలుగు యాత్రికులు ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజమండ్రికి చెందిన గునిశెట్టి సుధ, కొత్త పార్వతి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. శ్రీనగర్ నుంచి స్వయంగా ఏపీ ఐఏఎస్ ఉన్నతాధికారి హిమాంశ్ కౌశిక్ పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ రావాలనుకునే తెలుగు యాత్రికులు, బంధువులు ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ‘హెల్ప్ లైన్’ నెంబర్ల ద్వారా సంప్రదించాలని ఆయన వెల్లడించారు. తెలుగు యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!