ఈరోజు ఆన్ లైన్ లో వచ్చే జనవరి మాసంకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ. రోజుకి 8 వేల చోప్పున టీటీడీ టికెట్లను విడుదల చేసింది. అయితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన దర్శనాల టికెట్ల సంఖ్యను మాత్రం టీటీడీ ఇంకా పెంచలేదు. ఇదిలా ఉంటె టీటీడీ విడుదల చేసిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు గంటలో పూర్తి అయిపోయాయి. జనవరి మాసంకు సంభందించి నాలుగు లక్షల 60 వేల టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేయగా… కేవలం 60 నిమిషాలలో టికెట్లు కోనుగోలు చేసారు భక్తులు. ఇదిలా ఉంటె టీటీడీ ఇంకా జనవరి నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఇంకా విడుదల చేయలేదు.
గంటలో పూర్తయిన టీటీడీ దర్శనం టికెట్లు…
