కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతుంటారు.. ఇక, సర్వదర్శనం కోసం అయితే బారులు తీరుతుంటారు.. అయితే, టీటీడీ ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసిన అరగంటలోనే అన్నీ పూర్తి అయ్యాయి.. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లోపెట్టింది టీటీడీ.. రోజుకి 8వేల టోకెన్ల చొప్పున మొత్తం 2.79 లక్షల టికెట్లను విడుదల చేయగా… హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.. 25 నిముషాల్లోనే 2.4 లక్షల సర్వదర్శనం టోకెన్లు భక్తులు పొందగా.. కేవలం 30 నిమిషాల్లోనే సర్వదర్శనం టోకేన్లు కేటాయింపు పూర్తి అయిపోయింది.. క్లౌడ్ మేనేజ్మెంట్ విధానంతో సులభతరంగా ఆన్లైన్లో టికెట్లు పొందారు భక్తులు.. అయితే, టీటీడీ చరిత్రలోనే రికార్డ్ స్థాయి సమయంలో టికెట్ల కేటాయింపు పూర్తి అయ్యినట్టు అధికారులు చెబుతున్నారు.