Tirumala: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అన్యమత ఉద్యోగులపై చర్యలు!
- టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
- తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం..
- తిరుమలలో అన్యమత ఉద్యోగులపై టీటీడీ కఠిన చర్యలకు నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, భద్రత, శ్రీవారి సేవలకు సంబంధించి అనేక మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వైకుంట క్యూ కాంప్లెక్స్ 3 అధ్యాయనం కోసం కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు సైతం ప్లాన్ చేస్తున్నారు. తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పులను తీసుకొచ్చింది టీటీడీ.
Read Also: Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ హీరో అయిన 10 ఏళ్ల బాలుడు.. భారత ఆర్మీ బంపరాఫర్
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
అయితే, ఒంటి మిట్ట ఆలయంలో అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 4.35 కోట్లను టీటీడీ కేటాయించింది. శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. వసతి గదులు పెంపు కోసం అధ్యాయనం చేయడానికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, అలిపిరి నడకమార్గంలో భక్తులకు వసతి గదులు పెంపుపై అధ్యాయం చేయనున్నారు. వేద పరిరక్షణ కోసం 600 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి అందించడానికి రూ. 2.1 కోట్లు కేటాయింపుకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తిరుమలలో పాత భవనాలను కూల్చి వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనంపై కమిటి పరిశీలన జరుపుతోంది.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. ఇక, టీటీడీలోని కాంట్రాక్టు డ్రైవర్లును పర్మినెంట్ చెయ్యడానికి ప్రభుత్వానికి టీటీడీ ప్రతిపాదనలు పంపించడానికి రంగం సిద్ధం చేస్తుంది.
Read Also: HHVM : వీరమల్లుకు ప్రీమియర్ షోలు సాధించిన రోహిన్ రెడ్డి.. ఎవరితను..?
అలాగే, తిరుమలలో ఉన్న అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. కొంత మంది వీఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారం టీటీడీ వద్ద లేదు.. ఫిర్యాదుల ఆధారంగా, విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆలయ ఈవో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!