వివిధ పాలనా, సాంకేతిక పరమయిన కారణాల వల్ల ఆగిపోయిన ట్రూజెట్ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈనెల 5 వ తేదీ నుంచి ట్రూజెట్ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషంగా వుందని కంపెనీ వెల్లడించింది. ఈనెల 23వ తేదీ బుధవారం నుంచి వివిధ సెక్టార్లలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది.
- హైదరాబాద్-విద్యానగర్-హైదరాబాద్
- విద్యానగర్-బెంగళూరు-విద్యానగర్
- బెంగళూరు-బీదర్-బెంగళూరు
- హైదరాబాద్-రాజమండ్రి-హైదరాబాద్
- హైదరాబాద్-నాందేడ్-హైదరాబాద్
- ముంబై-నాందేడ్-ముంబై
- ముంబై-కొల్హాపూర్-ముంబై
- ముంబై-జలగావ్-ముంబై
ఈ రూట్లలో ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం అవుతాయని, తమ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ట్రూజెట్ తెలిపింది.
