Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Traffic Restrictions In Vijayawada On Wednesday For Jayaho Bc Maha Sabha

Jayaho BC Maha Sabha: నేడు జయహో బీసీ మహాసభ.. విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Published Date :December 7, 2022 , 8:01 am
By Sudhakar Ravula
Jayaho BC Maha Sabha: నేడు జయహో బీసీ మహాసభ.. విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన కేబినెట్‌లో బీసీలకు భారీగా అవకాశాలు కల్పించారు.. కిందిస్థాయిలో కూడా బీసీలకు పెద్దపీఠవేశారు.. ఇక, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాల ప్రజలను ఏం చేశామని చెప్పేందుకు సిద్ధం అవుతోంది వైసీపీ.. దీనికోసం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియం వేదికగా నేడు జయహో బీసీ మహాసభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైసీపీ నిర్వ హించిన బీసీ గర్జనలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌.. తన మూడున్న రేళ్ల పాలనలో చిత్తశుద్ధితో అమలుచేసి చూపిస్తున్నా రు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాలకు అధిక ప్రయోజనం చేకూర్చాన మంత్రలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట.. ఇక, ‘జయహో బీసీ’ మహాసభ వేదికగా తాము బీసీల కోసం తెచ్చిన పథకాలు, వాళ్లకు కల్పించిన ప్రాధాన్యత అన్ని చెప్పుకురానున్నారు..

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా ఇవాళ ఉదయం 10 గంటలకు జయహో బీసీ మహాసభ ప్రారంభంకానుంది.. ఈ మహాసభలో వైఎస్సా ర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. తాను సీఎం అయిన తర్వాత బీసీలకు చేస్తున్న మేలుతో పాటు.. రానున్న రోజుల్లోకలిగించబోయే ప్రయోజనాలను వివరించబోతున్నారు.. ఈ మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలికింది.. వారికి పేరుపేరునా ఆహ్వాన పత్రికలను పంపించింది.. ‘జయహో బీసీ’ మహాసభ.. వెనుకబడిన వర్గాలే వెన్నె ముక నినాదంతో నిర్వ హిస్తున్న ఈ మహాసభకు 82 వేలకు పైగా ప్రతినిధులతో పాటు.. లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని అంచనావేస్తున్నారు.. ఇక, జయహో బీసీ మహాసభ కోసం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ముస్తాబైంది.. సభా ప్రాంగణం వద్ద ఏర్పా టు చేసిన జ్యోతీరావు పూలే, సీఎం వైఎస్ జగన్‌ల భారీ కటౌట్లు ఏర్పాటుచేశారు..

ట్రాఫిక్‌ ఆంక్షలు..
* నగరంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభలను దృష్టిలో ఉంచుకుని బుధవారం విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాతీయ రహదారులపై భారీ వాహనాలను దారి మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలను జి కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.

* విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే భారీ వాహనాలను గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా మళ్లిస్తారు.

* గుంటూరు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.

* విశాఖపట్నం నుండి వచ్చే APSRTC బస్సులు రామవరప్పాడు రింగ్, మహానాడు, నోవాటెల్, బెంజ్ సర్కిల్, కృష్ణలంక మరియు PNBS మీదుగా మళ్లించబడతాయి.

* ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంజీ రోడ్డులో వాహనాలను అనుమతించరు.

* మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌లకు పార్కింగ్‌ స్థలం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్‌, శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే బస్సుల్లో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లో ఆంధ్రా లయోలా కాలేజీ గ్రౌండ్స్‌, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ చేయాలి సిద్ధార్థ. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ, కడప, నంద్యాల జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చే ప్రభుత్వ పాఠశాల మైదానం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చే అభ్యర్థులు సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో పార్కింగ్ చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జాతీయ రహదారులపై భారీ వాహనాలను సభ కోసం మళ్లిస్తారు మరియు పాల్గొనేవారికి వాహనాల పార్కింగ్ కోసం వివిధ ప్రాంతాలను కేటాయించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • heavy vehicles
  • Jayaho BC Maha Sabha
  • Similarly

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions