Toll Plaza Scam: చిన వెంకన్న సాక్షిగా అక్రమ టోల్ వసూళ్ళు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న శేషాచలం కొండపై అక్రమ టోల్ వసూలు బాగోతం బట్టబయలైంది. ఏడాదికాలంగా సంబంధిత కాంట్రాక్టర్, కొందరు ఆలయ ఉద్యోగులు టోల్ రుసుముల పేరుతో భక్తులను దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్లోని టోల్ గేట్ వద్ద భక్తుల వాహనాలకు రుసుములు వసూలు చేసుకునే నిమిత్తం 2020 జనవరి 27న దేవస్థానం బహిరంగ వేలం, సీల్ టెండర్లను నిర్వహించింది. ఇందులో ఒక కాంట్రాక్టర్ సీల్ టెండర్ ద్వారా రూ. 1,30,56,777 లకు టోల్ వసూలు చేసుకునే హక్కును కైవసం చేసుకున్నాడు.
Read Also: October Bank Holidays : అక్టోబర్లో 21 రోజులు బ్యాంకులకు సెలవులు
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
అయితే కరోనా నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ టోల్ నిర్వహణ బాధ్యతలను వెంటనే చేపట్టలేదు. దీంతో 2021 అక్టోబర్ 14 వరకు దేవస్థానమే టోల్ వసూళ్లను సొంతంగా నిర్వహించింది. ఇక టోల్గేట్ ను దేవస్థానమే నిర్వహించాలన్న ఉద్దేశంతో కారు, జీపు, వ్యాను టోల్ ధరను రూ. 30 నుంచి రూ. 50కు, ఆటో ధరను రూ. 10 నుంచి రూ. 25 కు పెంచుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో 2021 ఆగస్టు 14న తీర్మానం చేశారు. ఇదిలా ఉంటే సదరు కాంట్రాక్టర్ 2021 అక్టోబర్ 15న టోల్ గేట్ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు.
అయితే టెండర్ షరతుల్లోని ధరలను వసూలు చేయాల్సిన కాంట్రాక్టర్, ధర్మకర్తల మండలి సమావేశంలో చేసిన తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ఏడాది పాటు అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. కొందరు దేవస్థానం అధికారులు, సిబ్బంది సహకారంతోనే కాంట్రాక్టర్ ఇదంతా చేసినట్టు ప్రస్తుత ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు గుర్తించారు. దాంతో సదరు కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ. 27 లక్షలను తిరిగి దేవస్థానానికి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
Read Also: Anesthetic Injection: ఖమ్మంని కమ్మేసిన మత్తు.. వెలుగులోకి మరో ‘సూది హత్య’
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!