ఆంధ్రప్రదేశ్లో రోజూ వెయ్యికి పైగానే నమోదు అవుతున్న కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50,304 శాంపిల్స్ పరీక్షించగా.. 865 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 9 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 1,424 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,84,00,471 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,51,998 కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 20,27,229 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14,195కు చేరిందని.. ప్రస్తుతం 10,574 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.