ఆంధ్రప్రదేశ్లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 28,509 శాంపిల్స్ను పరీక్షించగా.. 248 మందికి కరోనా పాజిటివ్గా తేలింది… ఇక కరోనా కారణంగా ఈరోజు ఎటువంటి మరణం సంభవించలేదు. ఏపీ సర్కార్. ఇదే సమయంలో 253 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,03,44,770 కు చేరింది.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,446 కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,55,856 కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,158 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,432 కు పెరిగింది.