ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,054 శాంపిల్స్ పరీక్షించగా.. 231 మందికి పాజిటివ్గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, గడిచిన 24 గంటల్లో 362 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశీలించిన శాంపిల్స్ సంఖ్య 2,98,05,446 కి చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,718 కు చేరింది. రికవరీ కేసులు 20,51,082 కు పెరిగితే.. ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 14,403 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,233 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్.