ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,987 శాంపిల్స్ పరీక్షించగా.. 156 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 254 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,99,50,579కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,770కు పెరిగింది.. ఇక, 20,52,230 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,412 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 3,128గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.