ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో 47,972 శాంపిల్స్ పరీక్షించగా.. 1,002 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 12 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఒకేరోజు 1,508 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో నేటి వరకు 2,61,39,934 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,03,342కు చేరింది… రికవరీ కేసుల సంఖ్య 19,75,448 కు పెరగగా… ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 13,735కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,159 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.