Heavy Devotee In Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ఏకాదశికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు..
- టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Devotee In Tirumala: కలియుగ దైవం ఆ శ్రీనివాసుడు కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తిరుమలగిరుకు భక్తులు పొట్టెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 72, 487 మంది భక్తులు దర్శించుకోగా.. 29, 500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.52 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది.
Read Also: US: అమెరికాలో ఎయిర్లైన్స్ సంక్షోభం.. 1,100 ఫ్లైట్స్ రద్దు.. 4 వేల విమానాలు ఆలస్యం
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
మరోవైపు, 30వ తేదీ నుంచి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 30వ తేదీన స్వర్ణ రథంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. 31న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరగనుంది. 10 రోజులు పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ సందర్భంగా పది రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కాగా, వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి మూడు రోజులకు ఆన్ లైన్ విధానంలో ఇప్పటికే టికెట్ల జారీ పూర్తైంది. మిగిలిన ఏడు రోజులకు టోకెన్ లేకుండా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్యూ లైనులకు అదనంగా క్యూ లైనులు ఏర్పాటు చేస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డుని క్యూ లైనుగా టీటీడీ మార్చింది. 2400 మంది పోలీసులు,1150 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసింది.
తాజావార్తలు
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!