TTD Hundi Revenue: మరోసారి రూ.100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ..
- మరోసారి వంద కోట్ల మార్క్ను దాటిన శ్రీవారి హుండీ ఆదాయం..
- వరుసగా 33వ నెల 100 కోట్ల మార్కుని దాటిన హుండీ ఆదాయం..
- నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా 111 కోట్ల రూపాయల ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Hundi Revenue: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్ను దాటింది.. వరుసగా 33వ నెల 100 కోట్ల మార్కుని దాటింది. నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా 111 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీనితో ఈ ఏడాది మొత్తంగా స్వామివారికి 11 నెలల కాలంలో హుండీ ద్వారా 1,253 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అయ్యింది.. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ మొక్కులు చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా స్వామివారికి నిత్యం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు హుండీ ద్వారా ఆదాయం లభిస్తుంది. దీనితో నెలకి 100 కోట్లు పైగా స్వామివారికి హుండీ ఆదాయం లభిస్తుండగా ఏడాదికి హుండీ ద్వారా లభించే ఆదాయం 1300 కోట్లను దాటేస్తుంది.
Read Also: Saudi Arabia: ఏడాదిలో 300 మందికి పైగా మరణశిక్షలు అమలు చేసిన సౌదీ అరేబియా..
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
ఈ ఏడాది వరసగా స్వామివారికి 33వ నెల కూడా హుండీ ఆదాయం 100 కోట్ల మార్క్ ని దాటింది. కోవిడ్ కాలంలో తగ్గిన స్వామివారి హుండీ ఆదాయం.. అటు తరువాత 2022 మార్చి నుంచి కూడా ప్రతినెలా వందకోట్ల మార్కును దాటుతూ వస్తుంది. కాకపోతే గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ ఏడాది స్వామివారికి లభిస్తున్న కానుకలు కొంత తగుముఖం పట్టింది. ఈ ఏడాది జనవరి నెలలో శ్రీవారికి 116 కోట్లు.. ఫిబ్రవరి నెలలో 112 కోట్లు.. మార్చి నెలలో 118 కోట్లు.. ఏప్రిల్ నెలలో 101 కోట్లు.. మే నెలలో 108 కోట్లు.. జూన్ నెలలో 114 కోట్లు.. జూలై నెలలో 125 కోట్లు.. ఆగస్టు నెలలో 126 కోట్లు.. సెప్టెంబర్ నెలలో 114 కోట్లు.. అక్టోబర్ నెలలో 127 కోట్లు.. నవంబర్ నెలలో 111 కోట్ల రూపాయలు హుండీ ద్వారా స్వామివారికి ఆదాయం లభించింది. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీవారికి 1253 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. డిసెంబర్ నెలతో కలిపితే స్వామివారి హుండీ ఆదాయం 1360 కోట్ల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?