TTD Hundi Revenue: మరోసారి రూ.100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ..
- మరోసారి వంద కోట్ల మార్క్ను దాటిన శ్రీవారి హుండీ ఆదాయం..
- వరుసగా 33వ నెల 100 కోట్ల మార్కుని దాటిన హుండీ ఆదాయం..
- నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా 111 కోట్ల రూపాయల ఆదాయం..
TTD Hundi Revenue: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్ను దాటింది.. వరుసగా 33వ నెల 100 కోట్ల మార్కుని దాటింది. నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా 111 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీనితో ఈ ఏడాది మొత్తంగా స్వామివారికి 11 నెలల కాలంలో హుండీ ద్వారా 1,253 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అయ్యింది.. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ మొక్కులు చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా స్వామివారికి నిత్యం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు హుండీ ద్వారా ఆదాయం లభిస్తుంది. దీనితో నెలకి 100 కోట్లు పైగా స్వామివారికి హుండీ ఆదాయం లభిస్తుండగా ఏడాదికి హుండీ ద్వారా లభించే ఆదాయం 1300 కోట్లను దాటేస్తుంది.
Read Also: Saudi Arabia: ఏడాదిలో 300 మందికి పైగా మరణశిక్షలు అమలు చేసిన సౌదీ అరేబియా..
Also Read
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- TTD Server Issue: టీటీడీ సర్వర్లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
ఈ ఏడాది వరసగా స్వామివారికి 33వ నెల కూడా హుండీ ఆదాయం 100 కోట్ల మార్క్ ని దాటింది. కోవిడ్ కాలంలో తగ్గిన స్వామివారి హుండీ ఆదాయం.. అటు తరువాత 2022 మార్చి నుంచి కూడా ప్రతినెలా వందకోట్ల మార్కును దాటుతూ వస్తుంది. కాకపోతే గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ ఏడాది స్వామివారికి లభిస్తున్న కానుకలు కొంత తగుముఖం పట్టింది. ఈ ఏడాది జనవరి నెలలో శ్రీవారికి 116 కోట్లు.. ఫిబ్రవరి నెలలో 112 కోట్లు.. మార్చి నెలలో 118 కోట్లు.. ఏప్రిల్ నెలలో 101 కోట్లు.. మే నెలలో 108 కోట్లు.. జూన్ నెలలో 114 కోట్లు.. జూలై నెలలో 125 కోట్లు.. ఆగస్టు నెలలో 126 కోట్లు.. సెప్టెంబర్ నెలలో 114 కోట్లు.. అక్టోబర్ నెలలో 127 కోట్లు.. నవంబర్ నెలలో 111 కోట్ల రూపాయలు హుండీ ద్వారా స్వామివారికి ఆదాయం లభించింది. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీవారికి 1253 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. డిసెంబర్ నెలతో కలిపితే స్వామివారి హుండీ ఆదాయం 1360 కోట్ల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!