Tigers Hulchul: తెలుగు రాష్ట్రాల్లో చిరుతల భయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరణ్యాల్లో వుండాల్సిన వన్యప్రాణులు జనారణ్యాలకు చేరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు, పులుల సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గాలిబ్ నగర్ లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను చిరుత వెంబడించింది. బైక్ సైలెన్సర్ రేజ్ చేస్తూ… ప్రాణాలతో బయట పడ్డారు యువకులు. చిరుత సంచరిస్తున్న విషయాన్ని పోలీసులు, అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు ఆ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు గుర్తించారు. చిరుత సంచరిస్తున్న విషయం తెలిసి గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చిరుత సంచారంపై భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Kaali Poster: కాళీ పోస్టర్పై వివాదం.. నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా..
Also Read
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
మరోవైపు తిరుపతిలోని ఎస్వీ జూపార్క్ సమీపంలో చిరుతలు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆప్రాంతంలోని జనం భయాందోళనలకు గురవుతున్నారు. రెండురోజుల క్రితం తిరుమల కొండ ప్రాంతంలో చిరుత కనిపించింది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లాలోకి పులి ప్రవేశించిన సంగతి తెలిసిందే. నక్కపల్లి మండలం తిరుపతిపాలెం దగ్గర పులి అడుగుజాడలు గుర్తించారు. తటపర్తి దగ్గర గేదెపై పులి దాడి చేసింది. పులి సంచారంతో పాయకరావుపేట పరిధిలోని శ్రీరామపురం, తిరుపతిపాలెం, తడపర్తి, వెంకటాపురం గ్రామాల్లో టెన్షన్ ఏర్పడింది. దీంతో గ్రామస్తులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.అనకాపల్లికి వచ్చిన పులి కాకినాడలో సంచరించే పులి ఒకటే అని తేలింది. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సమీపంలోని కుచ్చులకొండ నుంచి తాండవ నది పరివాహక ప్రాంతానికి వెళుతూ తుని-కొట్టాం రోడ్డుపై పులి చేరుకుందని అధికారులు చెబుతున్నారు. నెలరోజులకు పైగా బెంగాల్ టైగర్ టెన్షన్ పెడుతోంది. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు.
Gold Rates: స్థిరంగా బంగారం ధరలు.. మరి వెండి?
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!