సిల్క్ డెవలప్మెంట్ స్కాం కేసులో రిమాండ్ కు ముగ్గురు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిల్క్ డెవలప్మెంట్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది కోర్ట్. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 2015 జూన్ లోనే కుంభకోణానికి శ్రీకారం చుట్టినట్లు తేల్చిన రిమాండ్ రిపోర్ట్… జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్ లకు దురుద్దేశ పూర్వకంగా సీమెన్స్ ప్రాజెక్టు సొమ్ము 241 కోట్లను ప్రభుత్వ భాగస్వామ్యంగా ఇచ్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఈ 241 కోట్లను పలు షెల్ కంపెనీలకు బదలాయించినట్టు గుర్తించిన సీఐడీ… ఏడు షెల్ కంపెనీల ద్వారా తప్పుడు ఇన్ వాయిస్ లు సృష్టించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. 241 కోట్లను పివిఎస్పి, స్కిల్లర్, డిజైన్ టెక్ కంపెనీ లకు తప్పుడు విధానంలో బదలాయించి… రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించినట్లు గుర్తించింది సీఐడి.
అయితే ప్రాజెక్టు వ్యయం ప్రభుత్వానికి, టెక్నాలజీ కంపెనీలకు మధ్య విభజించడంలో మోసాలు జరిగినట్లు గుర్తించిన సీఐడి… స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ప్రారంభించకుండానే.. డిజైన్ టెక్ అకౌంట్ లో 371 కోట్లు డిపాజిట్ చేసినట్లు.. అలాగే 2017-18 ఆర్థిక సంవత్సరంలో 371 కోట్లలో 241 కోట్లు గోల్ మాల్ జరిగినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ప్రభుత్వం 10%, డిజీ టెక్ 90% ఇవ్వవలసి ఉండగా.. డిజి టెక్ 90% ఇవ్వకముందే ప్రభుత్వ వాటా రిలీజ్ చేసినట్టు గుర్తించిన సీఐడీ… 2017లో డీజీజీఐ డిజైన్ టెక్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపింది.
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
అయితే సుమన్ బోస్ గా సంతకం చేసిన సౌమ్యాద్రి శేఖర్ బోస్… ఏపీ, గుజరాత్ అగ్రిమెంట్లలో సంతకాల మధ్య వ్యత్యాసం గుర్తించింది సీఐడీ. అగ్రిమెంట్ల పై సీమెన్స్ పరిశోధన ప్రారంభమైన వెంటనే రాజీనామా చేసిన సౌమ్యాద్రి శేఖర్ బోస్… సీమెన్స్ ఎండీ, వికాస్ కన్విల్కర్ ల మధ్య కరెన్సీ నోట్ల నంబర్లను టోకెన్ నంబర్లుగా పంపుకున్నట్టు గుర్తించిన సీఐడీ… ముఖ్యమైన ఫైళ్ళు, పత్రాలు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచీ తొలగించినట్టు గుర్తించింది. అయితే ఈ కేసులో ప్రాధమిక ఆధారాల మేరకు ఐపీసీ సెక్షన్లు 120(B), 166, 167, 418, 420, 475, 468, 471, 409, 201, 109 r/w 34,37 కింద కేసు నమోదు చేసారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!