ఏపీ జేఎసీ, ఏపీజేఎసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం , సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏక తాటిపైకి రావాలని నిర్ణయించినట్టు బండి ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చర్చల ద్వారా సంప్రదింపులు చేసుకుని ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నామన్నారు. పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల ద్వారా నష్టం జరుగుతుందన్నారు. ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మా డిమాండ్లు సాధించుకుంటామన్నారు. సచివాలయంలో రేపు ఉదయం 11.30 గంటలకు సమావేశ అనంతరం విధి విధానాలు వెల్లడిస్తామన్నారు.
పీఆర్సీ పై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు: సూర్యనారాయణ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత
పీఆర్సీ పై ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ అన్నారు. గంభీర పరిస్థితిని అర్థం చేసుకుని కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. పర్సనల్ అజెండా, అంతర్గత విభేధాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు.ఒకే తాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని డిసైడ్ అయ్యాం. మా పోరాటం చరిత్రలో లిఖించేందుకు కారణమవుతుంది. రేపటి నుంచి అందరిదీ ఒకటే మాట, ఒకే వాదన, ఒకటే డిమాండ్ ఉంటుందన్నారు.
Read Also: రింగు వలలపై కొలిక్కి రాని చర్చలు
ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలి: వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అందరి సమస్య ఒకటే కాబట్టి ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడి డిమాండ్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యమై ఒకే వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించాం. మెరుగైన పీఆర్సీ కోసం కలసి పోరాడనున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. రేపు సచివాలయంలో సమావేశమై తదుపరి కార్యాచరణ రేపు ప్రకటిస్తామని తెలిపారు.
నలుగురం ఏకాభిప్రాయానికి వచ్చాం: బొప్పరాజు, ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్
సచివాలయంలోని కార్యాలయంలో రేపు అన్ని డిమాండ్లపై చర్చించనున్నట్టు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు తెలిపారు. మెరుగైన పీఆర్సీ సహా ఎలాంటి డిమాండ్లు పెట్టాలనే అంశంపై చర్చిస్తామన్నారు. సమావేశంలో జరిగిన చర్చలను మా జేఏసీ సమావేశంలో తెలియజేస్తామన్నారు. ఇప్పటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మా జేఎసీల ఐక్యవేదికలతో అందరితో చర్చిస్తాం. రేపు సీఎస్కు సమ్మె నోటీసు ఇస్తాం. సమ్మె నోటీసు పై వెనక్కి తగ్గేది లేదు. అందరం కలిసి రేపు ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని బొప్పరాజు తెలిపారు.
