విద్యార్థులకు అన్యాయం అసత్య ప్రచారం-మంత్రి ఆదిమూలపు సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురంలోని SSBN కళాశాలలో చోటు చేసుకున్న ఘటన పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యా ర్థులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని.. విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యా ర్థులను రెచ్చగొట్టారన్నారు. ఈ క్రమంలో వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు.
పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేశారన్నారు మంత్రి సురేష్. ఈ సంఘటనను ప్రాథమిక నివేదికగా తీసుకున్నామన్న ఆయన.. 1991 నుంచి స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఈ ప్రాంగణంలో నడుస్తున్నాయన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ను రద్దు చేసుకుంటున్నట్లు కాలేజీ ప్రభుత్వానికి స్పష్టం చేసిందన్నారు. విద్యా ర్థుల, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే కుట్రతోనే అనంతపురం ఘటనకు తెర లేపారన్నారు. ఒక విద్యార్థినిపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారన్నారు. పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎక్కడి నుంచో రాయి వచ్చి తగిలిందని స్వయంగా గాయపడిన అమ్మాయి వీడియో విడుదల చేసిందని మంత్రి తెలిపారు.
Also Read
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
అయినా రాజకీయం చేయటానికి లోకేష్, చంద్రబాబు రంగంలో దిగారని వారిపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడైనా ఎయిడెడ్ విద్యా సంస్థల గురించి ఎప్పుడైనా సమీక్ష చేశారా అంటూ ఈ సందర్భంగా ఆయనను మంత్రి ప్రశ్నించారు. మంత్రి మాట్లాడు తుండగానే మంత్రి మీడియా సమావేశం ప్రాంగణంలోకి దూసుకు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు ఘెరావ్ చేశారు. దీంతో మంత్రి మీడియా సమావేశాన్ని మధ్యలోనే ఆపి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లా SSBN కళాశాలలో విద్యార్థుల పై లాఠీచార్జి ఘటన పై మంత్రి క్షమాపణలు చెప్పాలని విద్యార్థి సంఘాలు TNSF, PDSO డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..