ఏపీలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుస్తాయి. మాల్స్, దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పని సరిగా పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం జగన్.. భౌతిక దూరం పాటించేలా, మాస్క్లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు.మాస్క్లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్న సీఎం చెప్పారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని వెల్లడించారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించేలా చూడాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్డోర్స్లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశించారు.
Read Also: ఈ సారి కైట్ ఫెస్టివల్ లేనట్టే..
థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని ఆదేశించారు. దేవాలయాలు , ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించాలని.. మాస్క్ ధరించేలా చూడాలని పేర్కొన్నారు. కాగా 50 శాతం ఆక్యుపెన్సీతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే ఏపీలో తగ్గిన సినిమా రేట్లు , కరోనా కారణంగా పెద్ద చిత్రాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోగా, వచ్చే చిన్న సినిమాలకు సైతం 50శాతం ఆక్యూపెన్సీ కారణంగా చిత్ర పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు సీని విశ్లేషకులు పేర్కొంటున్నారు.