Financier Locked House : అప్పు తీర్చలేదని కుటుంబ సభ్యులని ఇంట్లోఉంచి తాళం వేసిన ఫైనాన్సర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పు చేయడం మరియు తీర్చడం మానవ సహజం. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల అప్పు తీర్చిడం ఆలస్యం కావచ్చు. లేదా అప్పు తీసుకున్న వ్యక్తి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొచ్చు. ఏదేమైన ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోతే న్యాయస్థానాన్ని సంప్రదించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లి డబ్బులని రాబట్టుకోవాలి. అలా కాకుండా న్యాయాన్ని చేతిలోకి తీసుకోవడం చట్టపరంగా నేరం. అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తన దగ్గర అవసరానికి అప్పు చేసిన వ్యక్తిని కుటుంబంతో సహా ఇంట్లో పెట్టి తాళం వేసాడు ఓ ఫైనాన్సర్. ఈ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.
Read also:Justin Trudeau: 50 ఏళ్లలో అత్యంత చెత్త కెనడా ప్రధాని ట్రూడో.. ప్రజామద్దతు ప్రతిపక్ష నేతకే..
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
వివరాలలోకి వెళ్తే విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని సీతారాంపురం అనే ఊర్లో ఉప్పల శ్రీనివాసరావు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కాగా అవసర నిమిత్తం అతను అంబల్ల కృష్ణ అనే ఫైనాన్సర్ వద్ద 2 లక్షల 80 వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు. కాగా 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా శ్రీనివాసరావు అప్పు తీర్చలేదు. ఈ నేపథ్యంలో కృష్ణ తెల్లవారు జామున 5 గంటల 30 నిమిషాలకు శ్రీనివాసరావుని తన కుటుంబంతో సహా ఇంట్లో పెట్టి తాళం వేసాడు. కాగా ఈ విషయం మీడియాకి మరియు హ్యూమన్ రైట్స్ అధికారులకి తెలిసింది. అధికారులు మరియు మీడియా శ్రీనివాస రావు ఇంటికి వస్తున్నారు అని తెలుసుకున్న కృష్ణ తాళం తీసి వెళ్ళిపోయాడు. అనంతరం మీడియా తో శ్రీనివాసరావు మాట్లాడుతూ తన సమస్యని మీడియాతో పంచుకున్నారు.
Read also:Minister KTR: కేటీఆర్ తో కడియం, రాజయ్య.. వారిద్దరూ కలిసిపోయారా..!
మీడియా తో మాట్లాడిన శ్రీనివాసరావు.. తనకి ఊర్లో బయట కలిపి 30 నుండి 40 లక్షల అప్పుందని. గత రెండు సంవత్సరాలగా తన పరిస్థితి బాలేదని.. తాను అప్పు తీసుకున్న వాళ్ళకి ఎంత సొమ్ము అప్పుగా ఇచ్చారో అంత సొమ్ము వడ్డీగానే కాట్టానని అయితే అసలు మాత్రం అలానే ఉంటుందని.. అంబల్ల కృష్ణ దగ్గర 2 లక్షల 80 వేలు తీసుకున్నానని.. అందులో 80 వేలు చెల్లించానని.. ఇక 2 లక్షలు చెల్లించాలని చెప్పారు శ్రీనివాస రావు.. అప్పు తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టాలనే ఆలోచన లేదని కానీ కృష్ణకి ఈ విషయం చెప్పిన వినకుండా ఇలా ఇంట్లో ఉంచి తాళం వేశారని.. ఇలా చేయడం ఇది రెండో సారని పేర్కొన్నారు. ఈ ఘటన పైన స్పందించిన హ్యూమన్ రైట్స్ అధికారి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పు తీసుకోవడం తీర్చడం మానవ సహాజం అని తెలిపిన హ్యూమన్ రైట్స్ అధికారి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం చట్టవిరుధం అని పేర్కొన్నారు. ఇలా అప్పు తీర్చలేదని ఇంట్లో పెట్టి తాళం వేయడం నేరమని పేర్కొన అయన ఈ ఘటన పైన కంప్లైన్ట్ తీసుకుంటాం. దీని వెనుక ఎవరున్నా శిక్షిస్తాం. తప్పు ఎవరు చేసిన చట్టం తన పని తాను చేసుకుపోతుందని శ్రీనివాస రావు కుటుంబానికి హ్యూమన్ రైట్స్ బృందం అండగా ఉంటుందని తెలిపారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!